నర్సంపేట/చెన్నారావుపేట, జూన్ 30: రాష్ట్రంలో గురువారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు హవా కొనసాగించారు. నర్సంపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ గ్రేడ్లు సాధించారు. అలాగే, మాంటిస్సోరీ పాఠశాలలో నలుగురు 10/10 జీపీఏ సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. చెన్నారావుపేట మండలంలో 390 మందికి 360 మంది విద్యార్థులు పాస్ అయినట్లు ఎంఈవో రత్నమాల తెలిపారు. ఇందులో బాలికలు 169కి 157 మంది, 221 మంది అబ్బాయిలకు 203 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే, సిద్ధార్థ హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు యాజమాన్యం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను నోడల్ అధికారి సృజన్తేజ, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అభినందించారు.
నర్సంపేటరూరల్/ఖానాపురం/రాయపర్తి/పర్వతగిరి: పదో తరగతి ఫలితాల్లో సర్కారు స్కూళ్ల విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించారు. నర్సంపేట మండలం 93 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో రత్నమాల తెలిపారు. మండలంలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికలు 96 శాతం, బాలురు 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 225మందికి 216 మంది, బాలురు 324 మందికి 292 మంది కలిసి మొత్తంగా 549 మందికి 508 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే, కమ్మపల్లి, మహేశ్వరం జడ్ఫీహెచ్ఎస్లతోపాటు ద్వారకపేట ముస్లిం మైనార్టీ గురుకుల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. మండలంలో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించినట్లు ఎంఈవో తెలిపారు.
నోడల్ ఆఫీసర్ రాంచందర్రావు వీరిని అభినందించారు. ఖానాపురం మండలంలో 95.19 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మండలంలోని 8 ప్రభుత్వ పాఠశాలు, కేజీబీవీ, మోడల్ స్కూల్, జ్యోతిబాపూలే, సైనిక్ స్కూల్ నుంచి 416 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఖానాపురం, కొత్తూరు, మనుబోతులగడ్డ, మంగళవారిపేట, ఐనపల్లి జ్యోతిబా పూలే విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. మండలంలో ఉత్తమ ఫలితాలు వచ్చినందుకు నోడల్ అధికారి మంగ్యాను ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అభినందించారు. రాయపర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు వచ్చినట్లు ఇన్చార్జి ఎంఈవో నోముల రంగయ్య, మండల విద్యాశాఖ నోడల్ ఆఫీసర్ గారె కృష్ణమూర్తి తెలిపారు.
12 జడ్పీహెచ్ఎస్లు, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం, కేజీబీవీలో 498 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 472 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సాంఘి క సంక్షేమ బాలికల గురుకులం బాలికలు ఎస్ శ్రీవైష్ణవి, జీ రవళి 10/10 జీపీఏ సాధించారు. పర్వతగిరి మండలంలోని జడ్పీహెచ్ఎస్ల విద్యార్థులు ఎస్సెస్సీలో హవా కొనసాగించినట్లు ఎంఈవో చదువుల సత్యనారాయణరావు తెపారు. మండల టాపర్గా నిలిచిన బాసాని పల్లవిని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సన్మానించారు.
గీసుగొండ/పోచమ్మమైదాన్/నెక్కొండ/సంగెం: పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. గీసుగొండ మండలంలోని పది ప్రభుత్వ పాఠశాలలతోపాటు మోడల్ స్కూల్, కేజీబీవీ కలుపుకుని 465 మంది విద్యార్థులకు 424 మంది ఉత్తీర్ణత సాధించారు. కొమ్మాల, గొర్రెకుంట పాఠశాలల విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించారు. మోడల్ స్కూల్ విద్యార్థులు సాదిక్పాషా, అక్షయ, టీఎస్డబ్ల్యూఆర్ఎస్ విద్యార్థి ప్రవీణ్ 10/10 జీపీఏ సాధించారు.
ప్రైవేటు పాఠశాలల్లో చదవుతున్న విద్యార్థులు 99 శాతం ఉత్తీర్ణులయ్యారు. కాశీబుగ్గలోని ప్రభుత్వ నరేంద్రనగర్(గుడిబడి) పాఠశాలలో ఇంగ్లిషు మీడియంలో 90 శాతం, తెలుగు మీడియంలో 50 శాతం ఉత్తీర్ణత సాధించారని హెచ్ఎం కుంట రవికుమార్ తెలిపారు. గోవిందుల శ్రీకర్ 10/10, సిరికొండ భవ్యశ్రీ 9.8 జీపీఏ, గుండు శ్రీకృతి 9.7 జీపీఏ సాధించినట్లు వెల్లడించారు. 182 మందికి 152 మంది ఉత్తీర్ణత సాధించిటన్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. నెక్కొండ ఆదర్శ పాఠశాల, రెసిడెన్షియల్ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు.
ఎన్ రవికుమార్ 10/10, కే శ్రీచందన, డీ నితన్, ఎస్ సిద్ధార్థ, పీ సిద్ధార్థ 9.8 జీపీఏ సాధించారని, ఏడుగురు విద్యార్థులు 9.7 జీపీఏ సాధించినట్లు ప్రిన్సిపాల్ ఉదయశ్రీ తెలిపారు. రెసిడెన్షియల్లో ఏ పావని, జీ భవాని, జీ తేజశ్రీ 10/10 జీపీఏ సాధించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యోదయ పాఠశాల విద్యార్థులు రాగి దుర్గాభవాని, సీహెచ్ అర్చన, ఆర్ శ్రీవల్లి 10/10 జీపీఏ సాధించనట్లు కరస్పాండెంట్ చల్లా నాగార్జున్రెడ్డి తెలిపారు. సంగెం మండలంలోని గవిచర్ల మోడల్స్కూల్ విద్యార్థి దొనికెల లక్ష్మణ్ 10/ 10, తీగరాజుపల్లిలో నోడర్డ్యామ్ పాఠశాల విద్యార్థిని జీ అపరంజిని 10/10, తిమ్మాపురం జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని నీలం అలేఖ్య 9.7 జీపీఏ సాధించినట్లు ఎంపీవో విజయ్కుమార్ తెలిపారు. మండలంలో 386 మందికి 31 మంది ఫెయిల్ అయినట్లు చెప్పారు. మోడల్ స్కూల్లో 9.8 జీపీఏలో కల్యాణి, ఎం ఝాన్సీదేవి, బీ కావేరి ద్వితీయస్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ ముజిబుర్ రహమాన్ తెలిపారు.