భీమదేవరపల్లి, జూన్ 24 :రాష్ట్రానికి నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం దగా చేస్తున్నదని జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్ మండిపడ్డారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జక్కుల అనితారమేశ్ అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హా జరైన సుధీర్కుమార్ మాట్లాడుతూ దేశం లో కేవలం ఐదు రాష్ర్టాల ద్వారానే కేంద్రానికి అత్యధికంగా నిధులు పన్నుల రూపం లో వస్తున్నాయని చెప్పారు. అందులో తెలంగాణ రాష్ట్రం ఒకటన్నారు.
కేంద్ర ప్ర భుత్వం మన రాష్ట్రం ద్వారా పన్నులు అ త్యధికంగా వసూలు చేస్తూ నిధులు మా త్రం అత్యల్పంగా ఇస్తోందని విమర్శించా రు.ప్రభుత్వానికి, ప్రజలకు అధికారులు వారధిగా ఉండాలన్నారు. సకాలంలో విధులకు హాజరై అంకితభావంతో పనిచేస్తే అభివృద్ధి త్వరగా జరుగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. కాగా, పలు అంశాలపై సభలో తీర్మానాలు చేశారు. గట్లనర్సింగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పక్క గ్రామాల పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వవద్దని మండల కోఆప్షన్ సభ్యు డు షరీఫొద్దీన్ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు.
అలాగే, ఉ పాధిహామీ పథకం, 15వ ఫైనాన్స్ నిధులు వెంటనే మంజూరు చేయాలని ఎంపీటీసీ మహ్మద్ అలీ మహ్మద్ తీర్మానం చేశారు. ఆర్మీ రిక్రూట్మెంట్ పాతపద్ధతిలోనే కొనసాగాలని, అగ్నిపథ్ను వెంటనే రద్దు చేయాలని ఎంపీటీసీ మండల సురేందర్ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. వంగరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను మంజూరు చేసిన ముఖ్యమం త్రి కేసీఆర్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్తోపాటు యూనిట్ స్థాపనకు భూ ములు అందజేసిన రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశారు.
కేవైసీ చేసుకున్నప్పటికీ చాలామంది రైతులకు కేంద్రం నుంచి వచ్చే డబ్బు రావడం లేదని ఎంపీటీసీ సురేందర్ తెలిపారు. అలాగే, కరోనా ఫోర్త్ వేవ్పై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యసిబ్బందికి ఎంపీపీ సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అక్షయపాత్ర దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాలని సీడీపీవో స్వరూపకు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ పోలం ఉమారాణి, ఎంపీడీవో భాస్కర్, ఎంపీవో నాగరాజు, మిషన్ భగీరథ డీఈఈ శ్వేత, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.