ఖానాపురం, జూన్ 24 : దళితబంధు పథకంతో దళిత కుటుంబాల రూపురేఖలు మారుతున్నాయని జడ్ఫీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న అన్నారు. బుధరావుపేట గ్రామానికి చెందిన దళితబంధు లబ్ధిదారులు సోమారపు రాజశేఖర్, సోమారపు రవి బుధరావుపేట, ఖానాపురంలో కిరాణా షాపులను ఏర్పాటు చేసుకున్నారు. కాగా, ఖానాపురంలో ఏర్పాటు చేసిన కిరాణా షాపును జడ్పీ ఫ్లోర్లీడర్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దళితబంధు లాంటి పథకం ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, కిషన్, డీటీడీవో జహీరుద్దీన్, బుధరావుపేట సర్పంచ్ కాస ప్రవీణ్కుమార్, కార్యదర్శి రజిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఎం పీటీసీలు మర్రి కవిత, బోడ భారతి, పూలు, మౌలానా, కళ్లపల్లి సురేశ్, రమే శ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట : దళితుల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న అన్నారు. దళితబందు పథకం నిధులతో నర్సంపేటలో బత్తిని శాంతికుమార్ గ్యాస్ ఏజెన్సీ అండ్ ఎలక్ట్రానిక్స్, పెరుమాండ్ల రాణి పరమేశ్వర ఐరన్ అండ్ హార్డ్వేర్ షాపులను ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం జడ్పీ ఫ్లోర్ లీడర్ ఈ షాపులను ప్రారంభించారు.