వరంగల్ లీగల్, జూన్ 24 : ఉమ్మడి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఆదివారం జరిగే లోక్ అదాలత్లో ఎకువ కేసులు పరిష్కారమయ్యేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని న్యాయసేవా సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కొకా రాధాదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కృష్ణమూర్తితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు 26న వరంగల్, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లా కోర్టులు, నర్సంపేట, పరకాల, తొర్రూరు కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీకుదుర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 1735 పెండింగ్ కేసులను పరిషరించేందుకు సిద్ధంగా ఉన్నామని కక్షిదారులకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఇందుకోసం 31 బెంచీలకు గాను వరంగల్లో 7, హనుమకొండలో 8, భూపాలపల్లిలో 3, ములుగు 2, మహబూబాబాద్ 3, నర్సంపేట 1, పరకాల 2, జనగామ 4, తొర్రూరు 1 బెంచీలను ఏర్పాటుచేసినట్లు ఆమె తెలిపారు. న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి, ఉచిత సలహాలు, సూచనలు పొందవచ్చని రాధాదేవి తెలిపారు.