ఖానాపురం, జూన్ 24 : ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని కలలు కని.. నెరవేరకుండానే పోలీసు కాల్పుల్లో అసువులుబాసిన దామెర రాకేశ్ కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. రాకేశ్ అన్న రామ్రాజుకు ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అతడి విద్యార్హతలను బట్టి వరంగల్ జిల్లాలో కొలువు ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశాలు పంపారు. ఘటన జరిగిన రోజే రాకేశ్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.25లక్షల ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని బాధిత కుటుంబానికి సీఎం కేసీఆర్ కొండంత అండగా నిలిచారు.
ఖానాపురం మండలం దబీర్పేటకు చెందిన దామెర రాకేశ్ (21) ఎలాగైనా జవాను కావాలన్న పట్టుదలతో రెండుసా ర్లు ‘రిక్రూట్మెంట్’కు హాజరై త్రుటిలో అవకాశం చేజార్చుకొని.. మళ్లీ ప్రయత్నించి ఫిజికల్ టెస్టులన్నీ పాసై ఎంపిక కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కేం ద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకం అతడి ఆశలను అడియాసలు చేసింది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ నెల 17 జరిగిన ఆందోళన ల్లో పోలీసుల కాల్పుల్లో రాకేశ్ ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ ఘ టన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభు త్వం అండగా నిలిచింది. ఇచ్చిన హామీ మేరకు రాకేశ్ అన్న రాజుకు ఉద్యోగం కల్పించి భరోసా ఇచ్చింది.
రాకేశ్ సోదరుడు రాంరాజ్కు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేయడంపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాంరాజ్కు ఉద్యోగం కల్పించాలని కలెక్టర్కు ఉత్తర్వులు జారీచేయించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.