వెంకటాపూర్, జూన్ 21 : యునెస్కొ గుర్తింపు పొందిన రామప్ప ఆలయ ప్రాంగణంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహించారు. టూరిజం, పురావస్తు, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగా గురువులు జితేందర్, శ్రీనివాస్ ఆధ్వర్యం లో సుమారు 400 మంది ఆసనాలు వేశారు.వరంగల్ నుంచి వచ్చిన చి న్నారుల ఆసనాలను ఆకట్టుకున్నాయి.
జిల్లా స్థాయి అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పతంజలి యోగా గురువులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు యోగా సనాలు వేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ యోగాతో ఆయుష్షు పెరగడమే కాకుండా ఉల్లాసంగా ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు యోగా నే ర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటాక్ కన్వీనర్, ప్రొఫెసర్ పాండు రంగారావు, కేంద్ర పురావస్తు శాఖ అధికారి మల్లేశ్ మాట్లాడారు.
దేశ వాప్తంగా పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న 3,891 కట్టడాల్లో 75 చోట్ల వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. ఉమ్మడి వరంగల్లో రామప్ప, వేయిస్తంభాల గుడి, వరంగల్ కోటలో నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, ఆర్డీవో రమాదేవి, డీపీవో వెంకయ్య, ఉమ్మడి జిల్లా టూరిజం అధికారి శివాజీ, రాష్ట్ర పురావస్తు శాఖ ఏడీ మల్లునాయక్, టూరిజం అధికారులు సూర్యకిరణ్, లోకేశ్, సర్పంచ్ డోలి రజితా శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్, ఇంటాక్ సభ్యుడు శ్రీధర్, తహసీలార్లు మంజుల, సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.