ఖిలావరంగల్, జూన్ 21: రోగ నిరోధక శక్తి పెరగడానికి ఆరోగ్య సంజీవనిగా యోగా ఎంతగానో ఉపయోగపడుంతని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగ ళవారం చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలోని కీర్తి తోరణాల మధ్య యోగా మహోత్సవ వేడుకులను ఎమ్మెల్యే నరేందర్, కలెక్టర్ డాక్టర్ బీ గోపి ప్రారంభించారు. అనంతరం యోగాసనాలు వేశారు.
అలాగే యోగాలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం యోగా చేయడం వల్ల ఏకాగ్రతతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రాణాయామ ప్రక్రియ మనలో రోగనిరోధక కణాలను పెంచు తుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను దిన చర్యలో భాగం చేసు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీ హరి సింగ్, శ్రీవత్స కోట, 37, 38 డివిజన్ల కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్యాదవ్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఆరోగ్య సంరక్షణకు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని మహానగర పాలకసంస్థ మేయర్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం ఖిలావరంగల్ ఖుష్మహల్ మైదానంలో పతంజ లి యోగా సమితి, భారత స్వాభిమాన్, పతంజలి యోగా మహి ళా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుక లు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకులను మేయర్ గుండు సుధారాణి, వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపు నేని నరేందర్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బీ రవీందర్రెడ్డి, కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి మాట్లాతూ ఆధునిక సమాజానికి యోగా ఎంతో అవసరమన్నారు. యోగా ద్వారా అనేక రకాల వ్యాధులను సమూలంగా దూరం చేసుకోవచ్చన్నారు. అనంతరం యోగా ఆసనాలు వేయించారు. అలాగే యోగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా పతంజలి అధ్యక్షురాలు మంజుశ్రీ, పతంజలి యోగాపీఠ్ హరిద్వార్ ప్రతినిధి దేవసత్య తదితరులు పాల్గొన్నారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో మంగళవారం ఖిలావరంగల్ కోటలో అంతర్జాతీయ యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, విశిష్ట అతిథిగా జిల్లా కలెక్టర్ బీ గోపి, అడిషనల్ కలెక్టర్లు హరిసింగ్, శ్రీవత్స పాల్గొని యోగా విశిష్టతను తెలిజేశారు. నెహ్రూ యువ కేంద్రం, వీఏపీ ఎన్ఎంఏ, పర్యాటక శాఖ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయుష్ జిల్లా ఇన్చార్జి డాక్టర్ రామారావు, డాక్టర్ పద్మావతి, డాక్టర్ అమృతవల్లి, డాక్టర్ జయప్రకాశ్, డాక్టర్ రవీందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.