కరీమాబాద్/వరంగల్చౌరస్తా, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని పలుచోట్ల యోగాసనాలు ప్రదర్శించారు. నిత్యం యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను యోగా గురువులు వివరించారు. మామునూరులో బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో యోగా చేశారు. ఎస్ఆర్ఆర్తోటలోని కివీ పాఠశాలలో ప్రిన్సిపాల్ దాసి సతీశ్మూర్తి ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు.
వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియం, సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్, పీఎంఎస్ఎస్వై సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్రావు మాట్లాడుతూ స్వల్ప, దీర్ఘకాలిక రోగాలకు దూరంగా ఉండాలంటే జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్ఎంవో డాక్టర్ నర్సింగరావు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: ప్రతి ఒకరిలో యోగా అనేది అంతర్లీనంగా ఉండే మహాశక్తి లాంటిదని డీఎంహెచ్వో డాక్టర్ కే వెంకటరమణ అన్నారు. దేశాయిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టీ భరత్కుమార్ అధ్యక్షతన యోగా వేడుకలు నిర్వహించారు. హెచ్ఎం అఫ్జల్ షరీఫ్, అహల్య, అర్బన్ హెల్త్ సూపర్వైజర్ జన్ను కొర్నేల్ పాల్గొన్నారు. ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ వరంగల్, వేదశ్రీ యోగ హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో వాసవీ కాలనీలోని ఇన్నర్వీల్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో యోగాసనాలు వేశారు.
రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ పాల్గొని యోగా విన్యాసాలు చేసిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు బీ లక్ష్మి, యోగా గురువు సీహెచ్ మహేశ్వర్, వాణి పాల్గొన్నారు. కాశీబుగ్గ, తిలక్రోడ్డులోని స్కాలర్స్ హైస్కూల్లో విద్యార్థులు యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. విద్యా సంస్థల చైర్మన్ సంఘ వెంకటరాజు, తెలంగాణ యోగా టీచర్స్ అలవెన్స్ కమిటీ జిల్లా కోఆర్డినేటర్ బుట్టి రంజిత్కుమార్, కరస్పాండెంట్ సంఘ జీవనజ్యోతి, ప్రిన్సిపాల్ నాంపల్లి అశోక్ పాల్గొన్నారు.
నర్సంపేట/వర్ధన్నపేట/నర్సంపేటరూరల్/నెక్కొండ: నిత్యం యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని వాసవీ మహిళా పొదుపు సంఘం అధ్యక్షుడు శింగిరికొండ రజినీగుప్తా అన్నారు. ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మహిళలు యోగా చేశారు. ఏకాగ్రతతోనే ఏదైనా సాధించొచ్చని ఆయన సూచించారు. దినచర్యలో భాగంగా రోజూ గంటపాటు యోగా చేయాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్లు ఉషారాణి, వనజ, భారతి, ఉజ్వలతోపాటు ఎస్ రజిని, సీహెచ్ విజయ, ఎస్ అరుణ, రజిత, శ్రావణ్య, సరిత పాల్గొన్నారు. అలాగే, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ బత్తిని చంద్రమౌళి ఆధ్వర్యంలో సిబ్బంది, అధ్యాపకులు యోగా చేశారు. టాస్క్ కో ఆర్డినేటర్ త్యాగయ్య, ఐక్యూ ఎస్సీ కోఆర్డినేటర్ శ్రీనాథ్, శివనాగ శ్రీను, రమేశ్, లఖన్సింగ్, విష్ణుకుమార్, కుమారస్వామి, సత్యనారాయణ, సమ్మయ్య, పూర్ణచందర్, విద్యార్థులు పాల్గొన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో గ్రామస్తులు యోగా చేశారు.
ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ వీరస్వామి ఆధ్వర్యంలో విద్యార్థులు యోగాసనాలు వేశారు. పిరమిడ్ రూపంలో చిన్నారులు వేసిన ఆసనాలు ఆకట్టుకున్నాయి. వర్ధన్నపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు యోగాసనాలు వేశారు. నర్సంపేట మండలం లక్నేపల్లి శివారు బిట్స్ ఇంజినీరింగ్ కళాశాల, బాలాజీ టెక్నో స్కూల్, ముగ్దుంపురం జయముఖి ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు యోగా విన్యాసాలు ప్రదర్శించారు. బిట్స్ కళాశాల చైర్మన్ రాజేంద్రప్రసాద్రెడ్డి, ప్రిన్సిపాల్ వీఎస్ హరిహరన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్లు భాస్కర్, మంజుల, శశిరేఖ, సెక్రటరీ రాజేశ్వర్రెడ్డి, టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్, ఏవో సలేంద్ర సురేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అదేవిధంగా నాగుర్లపల్లిలో గ్రామస్తులు యోగాసనాలు వేశారు. నెక్కొండ మండలం అలంకానిపేట, దీక్షకుంట, అప్పల్రావుపేట జడ్పీహెచ్ఎస్ల్లో సర్పంచ్లు, ఉపాధ్యాయులు విద్యార్థులకు యోగా సాధనపై అవగాహన కల్పించారు. అనంతరం యోగాసనాలు వేశారు. అలంకానిపేటలో సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీరవి, హెచ్ఎం జ్యోతి, ఉప సర్పంచ్ గుంటుక నర్సయ్య, కార్యదర్శి మధు, వార్డు సభ్యులు లక్ష్మి, రజిత, అంగన్వాడీ టీచర్లు రాంపెల్లి మంజుల, కంచరదాసు పద్మ, సముద్రాల పాపయ్య పాల్గొన్నారు. దీక్షకుంటలో సర్పంచ్ ఆలకుంట సురేందర్, కార్యదర్శి భానుప్రకాశ్, ఈజీఎస్ టీఏ సురేందర్, ఉపాధ్యాయులు, అప్పల్రావుపేటలో హెచ్ఎం బూరుగుపల్లి శ్రవణ్కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నల్లబెల్లి/ఖిలావరంగల్/సంగెం/గీసుగొండ: జీవితంలో యోగాను భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని నల్లబెల్లి సర్పంచ్ మల్లాడి కవిత స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో యోగా కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు రోజూ ఉదయానే యోగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు రవీందర్, విజేత, టీచర్లు కందుల గోవర్ధన్, రాజిరెడ్డి, యాదగిరి, అరుణాదేవి, ఊర్మిళ, విజయలక్ష్మి, కార్యదర్శి పద్మనాభస్వామి, గ్రామస్తులు నాగిరెడ్డి, రాజు, బాబు పాల్గొన్నారు. ఖిలావరంగల్ పరిధిలోని బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు యోగా శిక్షణ శిబిరం నిర్వహించారు.
ప్రిన్సిపాల్ ప్రకాశ్, వైస్ ప్రిన్సిపాల్ తిరుపతిరావు, డీన్ శశిధర్, బీఎస్హెచ్ విభాగం అధిపతి కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసాద్, ప్రవీణ్, దేవేందర్ పాల్గొన్నారు. రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యోగా వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ జీ శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ పీవో వాల్యానాయక్, అధ్యాపకులు శ్రీనివాసులు, రఫీయొద్దీన్, సుధాకర్, శ్రీనివాస్రెడ్డి, సోమయ్య, రుద్రాణి, భగీరథ్, రమేశ్ పాల్గొన్నారు. శ్రీపరివార్ యోగాచార్యులు గౌరోజు సదానందం బాపూజీ ఆధ్వర్యంలో సంగెం మండలం ముమ్మిడివరంలోని కేకే గార్డెన్స్లో యోగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి. ఎంపీపీ కందకట్ల కళావతి, ఎస్సై కిరణ్మయి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పులుగు సాగర్రెడ్డి, శ్రీపరివార్ కార్యదర్శి డాక్టర్ తిరుపతిరావు, సర్పంచ్లు గూడ కుమారస్వామి, మేరుగు మల్లేశం, ఎంపీటీసీలు కొనకటి రాణి-మొగిలి, గుగులోత్ వీరమ్మ-గోపీసింగ్, నాయకులు ఉండీల రాజు, రమేశ్ కొనకటి మొగిలి, నాగార్జునశర్మ పాల్గొన్నారు. గీసుగొండ మండలంలోని గొర్రెకుంట, మొగిలిచర్లలో యోగా దినోత్సవం నిర్వహించారు. పీఈటీ రఘువీర్ యోగాపై అవగాహన కల్పించారు. మరియపురం సర్పంచ్ అల్లం బాలిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దుగ్గొండి/పర్వతగిరి/చెన్నారావుపేట/ఖానాపురం/మట్టె వాడ/రాయపర్తి/గిర్మాజీపేట: రోజూ యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని దుగ్గొండి ఎంపీడీవో కృష్ణప్రసాద్ అన్నారు. మండలకేంద్రంలో ఎంపీడీవో మాట్లాడుతూ యోగాను దినచర్యలో భాగం చేసుకుంటే రోగాలు దరిచేరవన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, ఎంపీవో శ్రీధర్గౌడ్, మహ్మదాపురం, నాచినపల్లి, పీఏసీఎస్ చైర్మన్లు ఊరటి మహిపాల్రెడ్డి, సుకినె రాజేశ్వర్రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్వతగిరి ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్ మల్యాతండాలో యోగాసనాలు వేశారు.
ఏపీవో సుశీల్కుమార్, టీఏ రాజేందర్, కార్యదర్శి విజేందర్, యాకూబ్పాషా పాల్గొన్నారు. వడ్లకొండలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు అమడగాని రాజుయాదవ్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలో యోగా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉప్పలయ్య, కార్యదర్శి సునీల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చింతనెక్కొండలో సర్పంచ్ గటిక సుష్మామహేశ్, ఉపసర్పంచ్ దేవేందర్, హెచ్ఎం రమేశ్, కార్యదర్శి సరిత పాల్గొన్నారు.
చెన్నారావుపేటలోని ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం మల్లయ్య, ఉపాధ్యాయులు సూరయ్య, వీరభద్రయ్య, నర్సింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, విద్యార్థులు యోగా చేశారు. ఖానాపురం మండలం మంగళవారిపేట ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం విజయలక్ష్మి యోగా సాధన చేయించారు. నిత్యం యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరం అవుతుందన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాశీబుగ్గకు చెందిన యోగా గురువు గుండేటి రమణయ్య యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రవణ్, శ్రీకాంత్, వినోద, అమ్ములు, సాయి పాల్గొన్నారు.
రాయపర్తి మండలంలోని జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్, ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు యోగాసనాలు వేసి యోగా ప్రాధాన్యాన్ని తెలియజేశారు. పెర్కవేడులోని ఉన్నత పాఠశాలలో హెచ్ఎం గారె కృష్ణమూర్తి నేతృత్వంలో పీఈటీలు టీచర్లు, విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. వరంగల్ 26వ డివిజన్లోని గిర్మాజీపేట బొడ్రాయి వద్ద ఉన్న గోమతి పబ్లిక్ స్కూల్లో యోగా గురువు అప్పం భాస్కర్ ఆధ్వర్యంలో కరస్పాండెంట్ కూచన క్రాంతికుమార్ సమక్షంలో యోగా డే నిర్వహించారు.