పత్తి పంటలో కొత్త తరహా సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అంతర్జాతీయంగా దూదిపూలకు మంచి డిమాండ్ ఉండడంతో తాజాగా ఈ ఏడాది చీడ పీడల నుంచి తట్టుకునే అధిక సాంద్రత విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పద్ధతి ద్వారా ఎకరం విస్తీర్ణంలో సుమారు 25 వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఖర్చు తగ్గనుండగా, దిగుబడి పెరుగనున్నది. పంట ఒకేసారి చేతికి రావడమే కాక, రెండో పంట సాగుకూ అవకాశం ఉంటుంది. ఈ విధానంలో సాగు చేసే రైతులకు సర్కారు ఎకరానికి రూ.4 వేలు అందజేయనుంది. ఈ డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ప్రస్తుత వానకాలం జిల్లాలో 1,650 ఎకరాల విస్తీర్ణంలో అధిక సాంద్రత పత్తి సాగుకు వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఏడు మండలాల్లోని రైతులకు శిక్షణనిచ్చింది. అనువైన విత్తనాలనూ అందుబాటులోకి తెచ్చింది. వీటిని క్షేత్రస్థాయిలో ఏఈవోల పర్యవేక్షణలో రైతాంగం నాటుతున్నది.
వరంగల్, జూన్21(నమస్తేతెలంగాణ): ప్రభుత్వం ఏటా వానకాలం, యాసంగి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయడం ద్వారా లాభాలు పొందాలని రైతులకు పిలుపునిస్తోంది. ఇందులో భా గంగా ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పత్తికి డిమాం డ్ ఉన్నందున ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదే శించింది.
ఈ క్రమంలో జిల్లాలో రైతులు వానకాలం 1.21 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసే అవకా శం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు అవసరమైన వివిధ రకాల పత్తి విత్తనాలను అందుబాటులోకి తెచ్చా రు. తొలకరి పలకరించడంతో రైతులు కొద్ది రోజుల నుంచి సాధారణ పద్ధతిలో పత్తి పంట సాగు చేసేందు కు నడుం కట్టారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చీడపీడలను తట్టుకుని అధిక సాంద్రత పత్తి సాగు విధా నాన్ని అమల్లోకి తెచ్చింది.
దీంతో ప్రస్తుత వానాకాలం జిల్లాలో 1,650 ఎకరాల విస్తీర్ణంలో అధిక సాంద్రత పత్తి సాగుకు వ్యవసాయశాఖ అధికారులు నిర్ణయించా రు. ఈ మేరకు ఏడు మండలాల్లో వివిధ క్లస్టర్ల పరిధి లోని గ్రామాల్లో దీని సాగుకు రైతులను ఎంపిక చేశారు. దుగ్గొండి, ఖానాపురం, నర్సంపేట, గీసుగొండ, రాయ పర్తి, సంగెం, వర్ధన్నపేట మండలాల్లోని ఈ గ్రామాల్లో ఎంపికైన రైతులకు కొద్ది రోజుల క్రితం శిక్షణ ఇచ్చారు. ఈ కొత్త తరహా సాగుకు అనువైన పత్తి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నాలుగు విత్తన కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో నూజివీడు, రాశి కంపెనీల పత్తి విత్తనాలను జిల్లాకు కేటాయించింది.
అత్యధికంగా 1,550 ఎకరా ల్లో నూజివీడు కంపెనీ పత్తి విత్తనాలను రైతులు నాటే లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక రూపొం దించారు. తాము ఎంపిక చేసిన రైతులకు డీలర్ల నుంచి ఈ విత్తనాలను ఇప్పిస్తున్నారు. వీటిని వ్యవసాయ విస్త రణ అధికారులు(ఏఈవోలు) క్షేత్ర స్థాయిలో రైతుల వెంట ఉండి అధిక సాంద్రత సాగు పద్ధతిలో పత్తి విత్త నాలు నాటిస్తున్నారు. ఈ నెలాఖరులోగా 1,650 ఎక రాల విస్తీర్ణంలో ఈ విధానం ద్వారా పత్తి విత్తనాలు నా టడం పూర్తి కావాలనే లక్ష్యంతో ముందుకువెళ్తున్నారు.
సాధారణ పద్ధతిలో రైతులు గుబురుగా పెరిగే హైబ్రి డ్ వంగడాలను వాడుతున్నారు. ఎకరానికి 5,555 నుంచి 7,407 పత్తి మొక్కలు ఉండేలా విత్తనాలు నాటుతున్నారు. తద్వారా తక్కువ మొక్కలు ఉండడం వల్ల మొక్కలు గుబురుగా ఉండటం, పంట కాలం పెరగడం, గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువ కావ డం, యాజమాన్యానికి అవసరమయ్యే ఖర్చులు పెరగ డం వంటివి జరుగుతున్నాయి. సహజంగా ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుంది. పూత, కాత దఫదఫాలుగా రావడం వల్ల పత్తిని మూడు నుంచి నాలుగు సార్లు తీయాల్సిన పరిస్థితి. దీంతో ఒక ఎకరం లో పత్తి ఏరడానికి కూలీల ఖర్చు సుమారు రూ.8 వేలు అవుతుంది.
అధిక సాంద్రత పత్తి సాగు విధానం భిన్నంగా ఉంది. ఎకరంలో 25 వేలు లేదా 26,666, 29,630 మొక్కలు ఉండేలా పత్తి విత్తనాలు నాటితే వర్షాధారం గా సుస్థిర దిగుబడులు సాధించవచ్చు. ఈ పద్ధతిలో పత్తి సాగుకు ఎకరానికి 2.5 కిలోల విత్తనాలు అవస రం. విత్తనం నాటిన తర్వాత 45 రోజుల దశలో ఒక సారి, 60 నుంచి 70 రోజుల దశలో రెండోసారి మెపి క్వాట్ క్లోరైడ్ మందును లీటరు నీటిలో ఒక మి.లీ కలి పి పిచికారీ చేస్తే మొక్క దశ పెరుగుదల నియంత్రణలో ఉంటుంది.
మొక్క గుబురుగా పెరుగదు. కాయ బరు వు పెరుగుతుంది. ఎకరంలో పది క్వింటాళ్ల దిగుబడి రానుంది. యంత్రంతో ఒకేసారి పత్తి ఏరటం వల్ల ఎక రానికి సుమారు రూ.5 వేల ఖర్చు మాత్రమే వస్తుంది. నవంబరు లేదా డిసెంబర్లో ఇది రైతుల చేతికి రా నుంది. తరువాత దీని స్థానంలో రైతులు యాసంగి మరో పంటను సాగు చేసుకొనే అవకాశం ఉంది. అధిక సాంద్రత పత్తి సాగులో విత్తనాలు, చదును ఖర్చు పెరు గుతున్నందున ప్రభుత్వం ఈ విధానంలో పత్తి పంట సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.4 వేలు అందజే సేందుకు నిర్ణయించింది. ఈ డబ్బు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది.
అధిక సాంద్రత పత్తి సాగుతో రైతులు లాభాలను పొందవచ్చు. అధిక దిగుబడి వస్తుంది. భూసారం తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కల సాంద్రత పెంపు అనివార్యం. సాధారణంగా పెరు గుదలను నియంత్రించడానికి మెపిక్వాట్ క్లోరైడ్ మందును వాడాలి. నాటిన తరువాత 90 నుంచి 95 రోజుల సమయంలో తల తుంచితే కాపుతోపాటు కాయ పరిమాణం కూడా పెరుగుతుంది. నవంబర్ లేదా డిసెంబర్లో పంట చేతికొస్తుంది. గులాబీ రంగు పురుగు నుంచి తప్పించుకుంటుంది. రెండో పంట వేసుకొనేందుకు రైతుకు అనుకూలత.
– ఉషాదయాళ్, డీఏవో, వరంగల్