హనుమకొండ : వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని నాలాలను శుభ్రం చేయాలి. అవసరమైతే నాలాలను వెడల్పు చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో కలిసి జూపార్కు నాలాను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎట్టి పరిస్థితుల్లో వరద ముంపునకు గురికాకుండా పనులు చేపట్టాలన్నారు. అనంతరం జూపార్కులో వాకర్స్ తో కలిసి కలియ తిరిగారు. జూపార్కులోని పలు జంతువులను దత్తత తీసుకోవడంలో చొరవ చూపాలని చీఫ్ విప్ వాకర్స్ ను కోరారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.