హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 25: సామాజిక స్ఫూర్తినిచ్చే చిత్రాలను ప్రజలు అక్కున చేర్చుకొని ఆదరించాలని కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ బానోత్ సురేష్లాల్ అన్నారు. బుధవారం కాకతీయ విశ్వవిద్యాలయంలోని అర్ధశాస్త్ర విభాగం ప్రాంగణంలో విధాత సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు.
తెలుగు వెలుగుసాహితీ వేదిక జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనతో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమానే విధాత అని, ఈ చిత్రాన్ని ప్రజలు, యువత అందరించి విజయవంతం చేయాలని కోరారు.