హనుమకొండ చౌరస్తా, మార్చి 31: హనుమకొండ టైలర్స్స్ట్రీట్కు చెందిన తోట దామోదర్-జ్యోతిల కుమార్తె తోట సోని గ్రూప్-1 అధికారిగా ఎంపికైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన గ్రూప్-1 జనరల్ ర్యాంకుల జాబితాలో తోట సోనికి రాష్ర్టస్థాయిలో 203వ ర్యాంకు, మల్టీజోన్ స్థాయిలో 93వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రుల ప్రోద్బలంతో ప్రతిష్టాత్మకమైన ఢీల్లీలోని జేఎన్యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పీజీ పూర్తి చేసింది. అప్పటి నుంచి సివిల్స్ప్రిపరేషన్లో ఉంటూ తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్స్కు కూడా ప్రిపేర్ అయింది. ఈ క్రమంలో గ్రూప్-4లో ఉద్యోగం సాధించి ప్రస్తుతం శాయంపేట ఎంజేపీలో జూనియర్ అసిస్టెంట్గా విధులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అలాగే ఇటీవల ప్రకటించిన గ్రూప్-2లో కూడా జోనల్స్థాయిలో 3వ ర్యాంకు, గ్రూప్-3 లో ఉద్యోగ అర్హత సాధించింది. జిల్లాలోని నడికుడ మండలం చౌటుపర్తి గ్రామానికి చెందిన వీరు టైలర్స్స్ట్రీట్లో చిన్న బియ్యం వ్యాపారం షాపు నిర్వహిస్తున్నట్లు తోట దామోదర్ తెలిపారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తోట సోని గ్రూప్-1 అధికారిగా ఎంపికై జిల్లాలో ఉత్తమ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 203వ ర్యాంకు సాధించిన తోట సోనిని పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.