ఖిలావరంగల్, మార్చి 23 : వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ పనులకు సంబంధించిన నిధులను నిలిపివేయడంతో 9 గ్రామాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని స్థానిక సర్పంచ్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వారు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాలకు రావాల్సిన అభివృద్ధి నిధులను డివిజన్ యూనిట్గా మార్చడం వల్ల గ్రామాలకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద పని చేసిన పనిదినాలకు సంబంధించిన 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు తీవ్రంగా ప్రభావితమవు తున్నాయని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల గ్రామాల్లో ప్రాథమిక సదుపాయాల అభివృద్ధి పనులు నిలిచిపోయి, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే నిధులను విడుదల చేసి, గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను పునఃప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రాన్ని సమర్పించిన వారిలో ఖానాపూర్ సర్పంచ్ దాసరి రమేష్, ధర్మారావుపేట్ సర్పంచ్ ఎం వెంకన్న, మనుబోతులగడ్డ సర్పంచ్ ఏ శ్రీలత అశోక్, నానితండ సర్పంచ్ జ్యోతి, కోడ్తిమాట్ తండా సర్పంచ్ ఎల్ వసంత ఉన్నారు.