హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 17: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉత్తిష్టగణపతి ఆరాదన రుద్రునికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రుద్రేశ్వరస్వామికి 51 కిలోల పెరగన్నం, మిరియాలు పొడి, సొంటిపొడితో అన్నసూక్త మంత్రపఠనంతో రుద్రునికి అన్నపూజ నిర్వర్తించి అర్ధనారీశ్వరునిగా అలంకరించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుపతి జిల్లా పుంగనూరు నుంచి వచ్చిన శ్రీశ్రీ నరేంద్రకుమారస్వామి భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు.
ఆలయ ప్రాంగణంలో చాడ వాసుదేవరెడ్డి, అనిల్ కేడియా, ప్రతీక్ కేడియా, సరోజనమ్మ దాతృత్వంతో నిర్వహించిన మహాన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆర్యవైశ్య ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు గట్టు మహేశ్బాబు పాల్గొని అన్నప్రసాదవితరణ చేశారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, గంగు మణికంఠశర్మ, ప్రణవ్, సందీప్శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సతీష్కుమార్, కట్ల రాజు, సిబ్బంది రామకృష్ణ, రజిత పాల్గొన్నారు.