హనుమకొండ: ఐనవోలు మండలంలో వెంకటాపురం గ్రామంలోని శివగుండేశ్వర ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. భక్తులకు సోమవారం ఉదయం నాగుపాము పడగవిప్పి కనిపించింది. ఆలయంలో పామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. సోమవారం శివాలయాని పాము రావడం విశేషమని పూజారులు చెప్పారు.
శివగుండేశ్వర ఆలయంలో నాగుపామును మొదటగా భక్తులు మేటె హరికృష్ణ, మేటె ప్రవీణ్, రాయినేని అరుణ్లు చూశారు. సోమవారం కావడంతో స్వామి వారి దర్శనానికి వెళ్లగా ఆలయంలో నాగుపాము కనిపించింది. పడగ విప్పి కనిపించడంతో తాము భయంతో ఆలయం నుంచి బయటికి వచ్చాం అని హరికృష్ణ, అరుణ్, ప్రవీణ్ వెల్లడించారు. కొద్దిసేపటికి ఆలయం వెనుక వైపున్న బండమీద నుంచి చెట్లలోకి పాము వెళ్లిన్నట్లుగా భక్తులు పేర్కొన్నారు..