కేసముద్రం, నవంబర్ 24 : కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సన్నధాన్యానికి రికార్డు స్థాయిలో ధర పలికింది. జై శ్రీరామ్ రకానికి ఈ సీజన్లోనే అత్యధికంగా క్వింటాలుకు రూ.2579 అమ్ముడైంది. జై శ్రీరాం రకం సాగు విస్తీర్ణం తక్కువగా ఉండడం, డిమాండ్కు తగినట్లు ధాన్యం లేకపోవడంతో ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. గురువారం మార్కెట్ 17,183 బస్తాల ధాన్యం విక్రయానికి రాగా క్వింటాలుకు గరిష్ఠంగా రూ.2,579, కనిష్ఠంగా 1659 పలికింది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధాన్యాన్ని తీసుకురావాలని మార్కెట్ చైర్మన్ నారాయణరావు రైతులకు సూచించారు.