వరంగల్ : “ఊరికి ఉత్తరన” సినిమాలో వివాస్పద సీన్స్ ఉన్నాయని,అవి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని, లేని పక్షంలో సినిమాను అడ్డుకుంటామని కాకతీయ యూనివర్సిటీ (కేయూ)విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ జేఏసీ కి చెందిన విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణను కించపరిచే సన్నివేశాలున్నాయంటూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆందోళన చేపట్టింది.
తెలంగాణ రాష్ట్ర చిహ్నమైన కాకతీయ తోరణానికి వ్యక్తిని కట్టి తల క్రిందులుగా తీసే సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ).