హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 8: అవినీతి రహిత సమాజం ఏర్పాటు చేయడం మన అందరి లక్ష్యమని వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ అన్నారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని వరంగల్ పోలీస్ కమిషనర్ జండా ఊపి ప్రారంభించారు. హనుమకొండ జూనియర్ కళాశాల నుంచి అశోక సెంటర్ వరకు నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీలో విద్యార్థులతో పాటు, స్వచ్ఛంద సంస్థలకు సభ్యులు, ఏసీబీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ అవినీతిని నిర్మూలించడం ద్వారా దేశాభివృద్ధి జరుగుతుందని, భవిష్యత్తులో అవినీతి నిర్మూలనలో విద్యార్థి, యువత పాత్ర చాలా కీలకమన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1064 టోల్ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఇన్స్పెక్టర్ రాజు, ఇతర ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.