హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 21 : స్థానికేతరులతో జీవనోపాధి కోల్పోతున్నామనీ, నేడు స్వచ్ఛందంగా టైర్ల షాపులు బంద్ చేయనున్నట్లు కాకతీయ టైర్ ఫైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హనుమకొండ అధ్యక్షుడు కే నగేష్ తెలిపారు. కాకతీయ టైర్ ఫైటర్స్ అసోసియేషన్ (యూనియన్) ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో వారు గోడు వెళ్లబోసుకున్నారు. 40 సంవత్సరాలుగా చేతి వృత్తి అయిన పంచర్ షాపుల ద్వారా ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ, లైసెన్సలు తీసుకొని జీవనోపాధి పొందుతున్నామన్నారు.
కరోనా, లాక్ డౌన్ తరువాత 4 సంవత్సరాల నుండి స్థానికేతరులు వచ్చి పెట్రోల్ బంకుల్లో స్థిరపడి మా ఉపాది దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంకుల్లో సర్వీస్ పరంగా ఉచిత ఎయిర్ చెకప్ ద్వారా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కాని, దానికి తోడుగా, పంచర్లు కూడా చేస్తూ మా కుటుంబాలు రోడ్డున పడేలా చేశారని వాపోయారు. ఈ విషయమై పెట్రోల్ బంకుల్లో ఉన్న యాజమాన్యానికి మాసమస్యలు చెప్పిన కూడా వారు స్పందించడం లేదని, స్థానికేతరులు (బీహార్)వారు వారి సన్నిహితులతో కలిసి కొత్త షాపులు కూడా పెట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో త్రినగరిలో ఉన్న పెట్రోల్ బంకుల్లో ఉన్న అన్ని పంచర్ షాపులు తొలిగించి మా కుటుంబాలకు ఆదుకోవాలని వారు కోరారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎండీ ఖలీమ్, కోశాధికారి సీహెచ్ బిక్షపతి, రామచందర్, ఎస్కే జుబేర్, రవి, జాఫర్, ఎండీ హతీఫ్, ఎండీ ఫజల్, ఎలుదండి నవీన్, ఎండీ రఫిక్, మట్ల రవి, ఎండీ గఫర్, మేకల సునీల్, మెరుగు రాము, యాకూబ్ పాషా, శ్రవణ్ పాల్గొన్నారు.