ఉనికిని చాటుకొనేందుకు ప్రతిపక్ష పార్టీలు బోగస్ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. గన్నారం గ్రామ శివారులో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురైన పల్లెల ముఖచిత్రాన్ని మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. పల్లెప్రగతితో గ్రామాలు పట్టణాలను తలపిస్తున్నాయని తెలిపారు. సబ్బండవర్గాల సంక్షేమానికి సర్కారు కృషిచేస్తోందని చెప్పారు. సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ అన్నిరంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు
. – రాయపర్తి, మే 23
రాయపర్తి, మే 23 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకుల ఆదరణకు నోచుకోని తెలంగాణ పల్లెల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గన్నారం శివారు మామిడి తోట లో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అధ్యక్షతన కేశవాపురం, (కేశవాపురం, ఎర్రకుంటతం డా, జింకురాంతండా), తిర్మలాయపల్లి (తిర్మలాయపల్లి, గన్నారం) ఎంపీటీసీ స్థా నాల పరిధిలోని బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్తో కలిసి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్య యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో పల్లెల్లో సకల సౌకర్యాలను కల్పించినట్లు చెప్పా రు. సీఎం కేసీఆర్ దూరదృష్టి, రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శవంతమైన పరిపాలనతో పల్లెలన్నీ నేడు వసతుల కల్పనలలో పట్టణాలతో పోటీ పడుతున్నాయన్నారు. రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమానికి కోసం ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పనిచేస్తోందన్నారు. పల్లె ప్రగతి అమలుతో రాష్ట్రంలో పచ్చదనం శాతం గణనీయంగా పెరుగడంతోపాటు వాతావరణంలోనూ సమూల మార్పులు చోటు చేసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
బోగస్ మాటలతో ప్రతిపక్షాల మాయాజాలం..
రాష్ట్రంలో ఉనికి చాటుకోవడం కోసం బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలు మా యమాటలతో ప్రజలను బురిడీ కొట్టాలని చూస్తున్నట్లు చెప్పారు. దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన ఆ పార్టీలు ప్రజల జీవన విధానాలను మెరుగుపర్చలేకపోయాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పన్నుతున్న కుయుక్తులను విశ్వసించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీలకు ఇక్కడ స్థానం లేదని చెప్పారు. సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. అనంత రం గ్రామాల వారీగా పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడా రు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు : ఎమ్మెల్యే అరూరి రమేశ్
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను చేరవేయడమే ధ్యేయం గా బీఆర్ఎస్ శ్రేణులు పని చేయాలని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో అన్ని రంగాలు అభివృద్ధి పథంలో ముం దుకు సాగుతున్నట్లు వివరించారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, పంటల సాగు నీరు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మన ఊరు-మన బడి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్రూం ఇండ్లు, గృహలక్ష్మి పథకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆత్మీయ సమ్మేళనంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్రావు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, నాయకులు ఎండీ నయీం, గబ్బెట బాబు, పూస మధు, గారె నర్సయ్య, రెంటాల గోవర్ధన్రెడ్డి, సూదుల దేవేందర్రావు, మందాడి సుదర్శన్రెడ్డి, భాషబోయిన సుధాకర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు గజవెల్లి అనంత ప్రసాద్, కుక్కల భాస్కర్, గుగులోత్ సుం దర్నాయక్, చిలుముల ఎల్లమ్మ యాక య్య, బానోత్ శ్వేత, సుభాష్నాయక్, గుగులోతు బిక్కోజీనాయక్, మొలుగూరి పున్నమయ్య, ముత్తడి సాగర్రెడ్డి, ధూం సింగ్, గుడి మైబూబ్రెడ్డి, యుగేంధర్రెడ్డి, వశపాక కుమారస్వామి, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, మారయ్య, దొంతరబోయిన యాదగిరి, దోకురు దేవేందర్, గజవెల్లి రామశేఖర్, వేమన్రెడ్డి, బెల్లి పెద్దాపురం, ఉల్లెంగుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.