చిన్నగూడూరు, జూలై 25: సీరోలును కొత్త మండలంగా ప్రకటించడంపై డోర్నకల్ మండలంలోని మన్నెగూడెం పీఏసీఎస్ చైర్మన్ కొండపల్లి సీతారాంరెడ్డి, ఎంపీటీసీ కొండపల్లి విజయ్పాల్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లిలో డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రెడ్యానాయక్కు కృతజ్ఞతలు తెలిపారు.
కొత్తగా ఏర్పడిన మండలాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. పీఏసీఎస్ సహకార సంఘాల రైతులకు రుణాలివ్వాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్ రవీందర్రావుతో ఫోన్లో మాట్లాడారు. రైతులకు రుణాలివ్వవాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. తమ ఆకాంక్షను నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి మనమందరం అండగా నిలవాలన్నారు. వారి వెంట ఎంపీటీసీ విజయపాల్రెడ్డి, సీఈవో సతీశ్, టీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి, లక్ష్మా, శ్రీను, బాబు, నరేశ్ పాల్గొన్నారు.