ఖిలావరంగల్, జనవరి 13 : సికింద్రాబాద్ నుంచి వరంగల్ మీదుగా విశాఖపట్టణం వరకు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 15న ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ కోచింగ్, చీఫ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజర్ ఎన్కే మురళీధరన్ నాయర్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్లో ఉదయం 10.47కు ప్రారంభించిన అనంతరం మేజర్ రైల్వేస్టేషన్లలో కూడా వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
జనగామలో 11.34 గంటలకు, కాజీపేటలో 12 గంటలకు, వరంగల్లో 2.14 గంటలకు, మహబూబాబాద్లో 12.55 గంటలకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు సంబంధిత శాఖలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ట్రయల్ రన్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున వరంగల్ రైల్వేస్టేషన్ రెండో నంబర్ ప్లాట్ఫాంకు వందే భారత్ రైలు చేరుకుంది. ఒక నిమిషం ఆగిన తర్వాత సికింద్రాబాద్కు బయలు దేరింది.