మడికొండ, ఫిబ్రవరి 10 : మెట్టుగుట్టలోని స్వయంభూ మెట్టు రామలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని రూ.30 కోట్లతో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి, యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆలయ ప్రాంగణంలో రూ.6.98 కోట్ల దేవస్థాన నిధులతో ప్రాకార మండపం, నాలుగు రాజగోపురాల నిర్మాణ పనులకు శుక్రవా రం ఆయన భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి దేవాలయానికి ఏదో చేయాలనే ఆరాటం ఉండేదని, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని సామెత ఉన్నందని, ఆయన అనుగ్రహంతో రూ.30 కోట్ల నిధులతో మెట్టుగుట్ట దేవాలయాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా గుడి ప్రకార మండపం, రాజగోపురాల నిర్మాణానికి భూమి పూజ చేయడంతో తన జన్మ ధన్యమైందన్నారు. రూ.23 కోట్లతో గుట్టపై జరిగే అభివృద్ధి పనులకు డీపీఆర్ సిద్ధం చేయాలని డీఈని ఆదేశించినట్లు తెలిపారు. రూ.3 కోట్లతో ఆలయానికి ఉత్తర దారి నిర్మాణం, రూ.4.50 కోట్లతో గుట్ట చుట్టూ కాంపౌండ్ వాల్, భక్తుల వసతి కోసం రూ.8.50 కోట్లతో వంద గదుల సత్రం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే, వీవీఐలు, వీఐపీలు బస చేసేందుకు రూ.3 కోట్లతో పది కాటేజీల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రూ.2కోట్లతో ఆల య ప్రాంగణాన్ని బెంగళూరు గ్రానైట్తో తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.
శివుడి దీవెన, రాముల వారి ఆశీస్సులు, భక్తుల సహకారంతో మెరుగైన వసతులు కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఐనవోలు దేవాలయాన్ని గతంలో కంటే మెరుగ్గా తీర్చిదిద్దినట్లు గుర్తు చేశారు. ఆలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న పోలీస్ శాఖకు చెందిన సిగ్నల్ టవర్ను తొలగించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. వచ్చే మహాశివరాత్రి వరకు మెట్టుగుట్టపై పనులు పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవా లు సమీపిస్తున్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుం డా చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీని ఆదేశించారు. వీఐపీలు వచ్చే సమయంలో సాధారణ భక్తులకు ఆటంకం కలుగకుండా క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని జాతరను విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ నవీన్కు సూచించారు. అలాగే, మెట్టుగుట్టపై నిత్యన్నదానం చేస్తున్న భక్తుడు మాడిశెట్టి రాజేశ్, నిత్య అభిషేకాలకు సహకరిస్తున్న మరో భక్తుడు పెద్ది ప్రభాకర్ను ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ చైర్మన్ నవీన్, ఈవో శేషుభారతి, అర్చకులు అభిలాష్శర్మ, విష్ణువర్ధనాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
స్వయంభూలింగేశ్వరస్వామి, శ్రీసీతారామచంద్రస్వా మి ఆలయాల్లో వారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిపించారు. కార్పొరేటర్లు మునిగాల సరోజన, ఆవాల రాధికరెడ్డి, ఇండ్ల నాగేశ్వర్రావు, దేవాదాయశాఖ ఉపకార్యనిర్వాహక ఇంజినీర్ రమేశ్బాబు, సహాయక ఇంజినీర్ చందర్రావు, జీడబ్ల్యూఎంసీ డీఈ సంతోష్, ధర్మకర్తలు కుమారస్వామి, భూపాల్రెడ్డి, సంధ్యారాణి, ఓర్సు రాజు, పెద్ది ప్రభాకర్, అర్చకులు సత్యనారాయణశర్మ, దేవేందర్శర్మ, దర్గా సొసైటీ చైర్మన్ వనంరెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ సంపత్రెడ్డి, మాజీ కార్పొరేటర్ బసె శ్రీలేఖ, మెట్టుగుట్ట మాజీ చైర్మన్లు అల్లం శ్రీనివాసరావు, రవీందర్, కాంట్రాక్టర్ శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు కుందూరు రాజేశ్వర్రెడ్డి, బొల్లికొండ వినోద్కుమార్, మునిగాల కరుణాకర్, వెన్నమల్ల రమేశ్, బస్కె కృష్ణ, పల్లపు రాజేందర్, తాడూరి మోహన్, రామ్మూర్తి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.