వరంగల్ రూరల్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దామెర మండలం ఒగ్లాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణీకుల్లో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు పరకాలకు చెందిన వారిగా భావిస్తున్నారు. ఈ ఘటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.