వరంగల్, సెప్టెంబర్ 1 : భవన నిర్మాణ అనుమతుల మంజూరు టీఎస్ బీపాస్ నిబంధనలను పటిష్టంగా అమ లు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేషన్ టౌన్ప్లానింగ్ విభాగం అధికారులతో టీఎస్ బీపాస్, అనధికార లే అవుట్లు, పెండింగ్ ఫైళ్లపై సమీక్షించారు. సర్కిళ్ల వారీగా సమీక్ష చేసి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు పరిశీలించి పైఅధికారులకు పంపించాలని టీపీబీవోలను ఆదేశించారు. టీఎస్ బీపాస్ పెండింగ్లపై అధికారులను అడిగితెలుసుకున్నారు. 74 52 దరఖాస్తుల్లో 4925 ధరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామని 367 మంజూరు ప్రక్రియలో ఉన్నాయని 1759 షార్ట్ఫాల్ ఉండడంతో తిరస్కరించామని సీపీ వివరించారు. టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతుల మంజూరులో జాప్యం చేయొద్దన్నారు. హై కోర్టు, లోకాయుక్త కోర్టుల నుంచి వచ్చిన అదేశాలను అమలు చేస్తూ గడువులోగా, కోర్టు కేసులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రేటర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నిర్మాణాలను దృష్టిపెట్టాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని శీథిలావస్థలో ఉన్న గృహాలను తొలగించాలన్నారు. ఈ సమావేశంలో సిటీ ప్లానర్ వెంకన్న, డిప్యూటీ కమిషనర్లు జోనా, శ్రీనివాస్రెడ్డి, లీగల్ అధికారి శ్రీనివాస్, డీసీపీలు ప్రకాశ్రెడ్డి, ఏసీపీలు బషీర్, సుష్మ, శ్రీనివాస్రెడ్డి, టీపీఎస్, టీపీబీవోలు పాల్గొన్నారు.
వరంగల్: దేశంలోనే తొలి మానవ వ్యర్థాల శుద్ధ్దీకరణ ప్లాంట్ను ఏర్పాటు చేసి నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచే చర్యలు తీసుకున్నామని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంటల్ ఇన్సియేటీవ్ ( ఐసీఎల్ఈఏ) సంస్థ గ్లోబల్ సర్క్యులర్ డెవలప్మెంట్ స్ట్రాటజీక్ ప్రోగ్రాం అంశంపై ప్రపంచ వ్యాప్తంగా మేయర్ల వర్చువల్ సమా వేశంలో మేయర్ పాల్గొన్నారు. దేశంలో తొలి మానవ వ్యర్థాల శుద్ధ్దీకరణ ప్లాంట్ను ఏర్పాటు చేసి సమర్థ వంతంగా నిర్వహిస్తున్నామన్నారు. దీనితో పాటు నగర అవసరాలకు అనుగుణంగా మరో 150 కేఎల్డీ సా మర్థ్యం కలిగిన ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పలు దేశాలలోని నగరాల మేయర్లు చారీస్ హఫ్మన్ మగేశ్, డేనియల్ అడెనియి, జకియా, ఇంగ్ చిహ్ డెంగ్, మరియా అల్ఫోనో, తదితరులు పాల్గొన్నారు.