తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా బుధవారం నిరసనలు వెల్లువెత్తాయి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణపై మోదీ అక్కసు వెల్లగక్కాడని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్తోపాటు ఇతర నాయకులు, ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నల్లబ్యాడ్జీలు ధరించి, నల్లజెండాలు చేతబూని బైక్ ర్యాలీలు నిర్వహించారు. ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు.
నర్సంపేట/కరీమాబాద్, ఫిబ్రవరి 9: మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ నర్సంపేట పట్టణంలో నల్లజెండాలతో ర్యాలీలు నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి ర.ఇనీకిషన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ మాట్లాడుతూ మోదీ.. ఇక నీ ఆటలు సాగవని, తెలంగాణపై విషం కక్కితే ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ర్టాన్ని సాధించుకున్నామని, విభజనపై మోదీ దిగజారి మాట్లాడడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, నామాల సత్యనారాయణ, రాయిడి దుశ్యంత్రెడ్డి, నాగిశెట్టి ప్రసాద్, యాదగిరి, మండల శ్రీనివాస్, పెండెం వెంకటేశ్వర్లు, పుట్టపాక కుమారస్వామి, గోనె యువరాజు, కౌన్సిలర్లు రాంబాబు, పాషా, గొల్య, రాజు, చంద్రమౌళి, సదానందం, క్రాంతికుమార్, వేణుగోపాల్రెడ్డి, బీరం నాగిరెడ్డి పాల్గొన్నారు. వరంగల్ కరీమాబాద్లో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, సిద్ధం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ ఆధ్వర్యంలో నాయకులు తరలివెళ్లారు. ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్ ఆధ్వర్యంలో 42వ డివిజన్ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. 43వ డివిజన్ కార్పొరేటర్ అరుణ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నిర్వహించిన బైక్ ర్యాలీలో నోముల వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
చెన్నారావుపేట/దుగ్గొండి/వర్ధన్నపేట: పార్లమెంట్లో నరేంద్రమోదీ తెలంగాణపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పకుంటే బీజేపీ నాయకులను తెలంగాణలో తిరుగనివ్వమని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్ హెచ్చరించారు. చెన్నారావుపేట బస్టాండ్ ఆవరణలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, ఆర్బీఎస్ జిల్లా డైరెక్టర్ తూటి శ్రీనివాస్, మండల కో ఆప్షన్ సభ్యులు గఫార్, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కందకట్ల సాంబయ్య, మాజీ ఎంపీటీసీ మాదాసి కుమారస్వామి, వార్డు సభ్యులు శ్రీధర్రెడ్డి, మల్లయ్య, కొమురయ్య పాల్గొన్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావిలో మోదీ చిత్రపటంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి దహనం చేశారు. టీఆర్ఎస్ దుగ్గొండి మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, క్లస్టర్ ఇన్చార్జిలు పొన్నం మొగిలి, గుండెకారి రంగారావు, ఎన్నారై రాజ్కుమార్, ముదురుకోళ్ల కృష్ణ, బొమ్మినేని శ్రీనివాస్రెడ్డి, బొమ్మగాని వెంకన్న, శంకర్, ఐలయ్య, రాజన్న, గోపాల్రెడ్డి, రామారావు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వర్ధన్నపేటలో మోదీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. పార్టీ శ్రేణులు వర్ధన్నపేట పట్టణం నుంచి ఉప్పరపల్లి క్రాస్రోడ్డు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం నల్లజెండాలతో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో చేశారు. ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ కే రాజేశ్ఖన్నా, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
నల్లబెల్లి/ఖానాపురం/గీసుగొండ/నెక్కొండ/పర్వతగిరి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంపై పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న అన్నారు. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి ఆధ్వర్యంలో నల్లబెల్లిలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్, వైస్ ఎంపీపీ గందె శ్రీలతా శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, సర్పంచ్లు ఎన్ రాజారాం, మామిండ్ల మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ కొత్తపల్లి కోటిలింగాచారి, కృష్ణ, ఆకుల సాంబారావు, భట్టు సాంబయ్య, నన్నెసాహెబ్, సుభాష్, మాజీ ఎంపీటీసీ వీరస్వామి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మాట్లాడిన తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖానాపురంలో బైక్ ర్యాలీ నిర్వహించి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రధాని కించపరిచారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ వేణుకృష్ణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. గీసుగొండ మండలం గొర్రెకంట క్రాస్రోడ్డు వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, వరంగల్ 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, ఆర్బీఎస్ గ్రామ కన్వీనర్ గజ్జి రాజు, నాయకులు గోలి రాజయ్య, సుంకరి శివ, కృష్ణయ్య, లవ్రాజు, నర్సయ్య పాల్గొన్నారు. నెక్కొండలోని అంబేద్కర్ కూడలిలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి, ఎంపీపీ జాటోత్ రమేశ్, సొసైటీ చైర్మన్ మారం రాము, జడ్పీటీసీ లావుడ్యా సరోజనా హరికిషన్, వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటుక సోమయ్య, ఉప సర్పంచ్ వీరభద్రయ్య, యూత్ పట్టణ అధ్యక్షుడు బొడ్డుపెల్లి రాజు, నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పర్వతగిరిలో బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేస్తూ నల్లజెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్గౌడ్, జడ్పీటీసీ సింగ్లాల్, మాజీ జడ్పీటీసీ పంతులు, చింతపట్ల సోమేశ్వర్రావు, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ చిన్నపాక శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్రావు, నాయకులు సర్వర్, రంగయ్య, దుర్గారావు, సాయిలు, భిక్షపతి, గటిక మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాశీబుగ్గ/సంగెం/పోచమ్మమైదాన్: రాష్ట్ర ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వరంగల్ 3, 14వ డివిజన్ కార్పొరేటర్లు జన్ను షిబారాణి, తూర్పాటి సులోచన డిమాండ్ చేశారు. ఎనుమాముల మార్కెట్ ప్రధాన గేటు ఎదుట నల్లబ్రాడ్జీలతో నిరసన తెలిపి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా కోశాధికారి ఈట్యాల హరికృష్ణ, మాజీ జడ్పీటీసీ తూర్పాటి సారయ్య, టీఆర్ఎస్ నాయకులు ఎల్లావుల కుమార్యాదవ్, జన్ను అనిల్కుమార్, ముడుసు నరసింహ, కేతిరి రాజశేఖర్, గండ్రాతి భాస్కర్, పత్రి రాజపోశాలు, గంధం గోవింద్, సలీం, ఈర్ల రాజేందర్, కృష్ణ, కొత్తపల్లి అనిల్, ఈట్యాల సతీశ్, పండుగ రవీందర్రెడ్డి, పస్తం యాదగిరి, భూక్యా శంకర్, పిట్ట నగేశ్, నేరెళ్ల రాజు పాల్గొన్నారు. సంగెంలో మోదీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. సర్పంచ్లు బాబు, ప్రభాకర్, ఎంపీటీసీ మల్లయ్య, ఉప సర్పంచ్ శరత్, పొడేటి ప్రశాంత్, మునుకుంట్ల చందు, పెండ్లి పురుషోత్తం, బొమ్మాల శంకర్, రాజ్కుమార్, భరత్, రాంబాబు, జనగాం శ్రీనివాస్, కోడూరి సదయ్య పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్ ప్రాంతంలో కార్పొరేటర్లు, నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. 12వ డివిజన్ నుంచి కార్పొరేటర్ కావటి కవిత, 13వ డివిజన్ నుంచి కార్పొరేటర్ సురేశ్కుమార్ జోషి, 21వ డివిజన్ నుంచి కార్పొరేటర్ ఎండీ ఫుర్కాన్, 22వ డివిజన్ నుంచి పార్టీ నాయకుడు మావురపు విజయభాస్కర్రెడ్డి, 23వ డివిజన్ నుంచి పార్టీ నాయకులు యెలుగం సత్యనారాయణ, యెలుగం శ్రీనివాస్ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ జాతిని అవమానించారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. పోచమ్మమైదాన్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ప్రజల చిరకాలవాంఛ అయిన రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన మోదీ తన ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, జన్ను రవి, గజ్జల లింగమూర్తి, భాషపాక సదానందం, చిప్ప వెంకటేశ్వర్లు, శ్రీలత, ప్రమీల పాల్గొన్నారు.
పర్వతగిరి, ఫిబ్రవరి 9: తెలంగాణ రాష్ట్ర విభజన ప్రజాస్వామిక పద్ధతిలో జరుగలేదని పార్లమెంట్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్లు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కందికట్ల అనిల్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ ఆత్మహత్యలను ఆపేందుకు సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి యూపీఏ, ఎన్డీయే పక్షాలను ఒప్పించి చట్టబద్ధంగా రాష్ర్టాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విభజన చట్టానికి తూట్లు పొడుస్తూ ఒక్క హామీనీ నెరవేర్చకుండా కాంగ్రెస్ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. బీజేపీ మతరాజకీయాలతో విభేదాలు సృష్టిస్తూ పబ్బం గడుపుతున్నదని విమర్శించారు. బీజేపీ నేతలను తెలంగాణ ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ప్రధాని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.