హనుమకొండ, జూన్ 22 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా విభాగాల వారీగా జరుపుకున్నట్లు అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి అన్నారు. దశాబ్ది ఉత్సవాల చివరి రోజు గురువారం అమరుల సంస్మరణ దినం సందర్భంగా సాయంత్రం ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ నుంచి కీర్తి స్తూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ 2014 జూన్ ఒకటిన అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్ బంగ్లా ఎదుట తెలంగాణ అమరవీరుల కీర్తి స్తూపం ఆవిష్కరించినట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ స్తూపం తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే ముఖ్య ఘట్టంగా నిలిచిపోయిందన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి త్యాగాలను భవిష్యత్ తరాలకు చాటి చెప్పడానికి 32 అడుగుల కీర్తి స్తూపం నిర్మించినట్లు చెప్పారు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద స్తూపమన్నారు.
తెలంగాణ కోసం వందలాదిమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, వారికి నివాళులర్పిస్తూ ఈ స్తూపాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అమరుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని, ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నదన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అన్నమనేని జగన్మోహన్రావు మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ అమరవీరులకు రాష్ట్ర సరారు అండగా ఉంటున్నదన్నారు. ఆరు దశాబ్దాల పోరాటంలో ఎందరో అమరుల త్యాగఫలం కేసీఆర్ ధృడసంకల్పంతో తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకరమైందన్నారు. ప్రత్యేక రాష్ట్రం రావాలని ప్రాణాలు అర్పించిన అమరుల ఆశయాలు స్వరాష్ట్రంలో ఒకొకటిగా నెరవేరుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే అమరులకు నిజమైన నివాళిగా పేరొన్నారు. అమరుల ఆశయాలను సీఎం కేసీఆర్ ఆచరణలో పెడుతూనే వారి కుటుంబాలను అకున చేర్చుకుంటూ అండగా నిలబడుతున్నారన్నారు.
తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గణిపాక రాజ్ కుమార్ మాట్లాడుతూ అమరుల త్యాగాల స్ఫూర్తితో సుపరిపాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు ఆకవరపు శ్రీనివాస్కుమార్ మాట్లాడుతూ అమరులు త్యాగాలను భవిష్యత్ తరాలు గుర్తుంచకొనేలా కీర్తి స్తూపం నిర్మించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ అమరులందికీ వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యోగుల పక్షాన నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, జిల్లా అధికారుల సంఘం కార్యదర్శి మేన శ్రీను, టీజీవో కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్కుమార్, జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు పుల్లూరు వేణుగోపాల్, పనికిల రాజేశ్, పెన్షనర్ల సంఘం నాయకులు సర్వర్ హుస్సేన్, సారంగపాణి, శ్యాంసుందర్, కత్తి రమేశ్, వేణు, ఈగ వెంకటేశ్వర్లు, రత్నవీరాచారి, రాము నాయక్, సరస్వతి, సుష్మ, పావని, యమున, రజిత, శ్రీలత, బోనాల మాధవి, బత్తుల జ్యోత్స్న, యాదగిరి, రఘుపతి రెడ్డి, వెంకట్రాంరెడ్డి, సురేశ్, రాజమౌళి, అరుణ, జయంతి, కల్పన, ప్రణయ్, రాజీవ్, భరత్, మాధవరెడ్డి, అజర్, రాంప్రసాద్, లక్ష్మీప్రసాద్, భాసర్, అనూప్, భగవన్ రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, కిషన్రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.