అపూర్వ ఘట్టానికి వేళయిన సందర్భాన జగమంతా రామనామం స్మరిస్తోంది. సోమవారం బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగనున్న నేపథ్యంలో భక్తిభావం వెల్లివిరుస్తోంది. ఇప్పటికే ఇంటింటికీ ‘అయోధ్య అక్షింతలు’ చేరగా నేడు పూజలు, విశేష కార్యక్రమాలు నిర్వహించేం దుకు ఆలయాలు ముస్తాబయ్యాయి. అలాగే అయోధ్య లైవ్ను వీక్షించేందు కు పలు ఆలయాల వద్ద ఎల్ఈడీ స్క్రీన్లు సిద్ధం చేయగా ఊరూవాడ రామనామంతో మార్మోగనున్నది.