హనుమకొండ సిటీ, మే19: ఈనెల 23 నుంచి ప్రారం భమయ్యే పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యా శాఖ అధికారి బహునూ తుల రంగయ్య నాయుడు తెలిపారు. గురువారం జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జా గ్రత్తలు, ఏర్పాట్లపై ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 12,057 మంది విద్యా ర్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతుండగా, వారిలో 6599 మంది బాలురులు, 5908 బాలికలు ఉన్నా రన్నారు. పరీక్ష 9.30 ప్రారంభమవుతుండగా, 9.35 తర్వాత వచ్చే విద్యార్థులకు పరీక్ష హాల్లోకి అ నుమతి లేదన్నారు. సుదూర ప్రాంతాల దృష్ట్యా విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా 71 కేంద్రాల్లో 6 సెల్ప్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగిదందని వా టిలో దామెర, సిద్దాపూర్, వెలేర్లో 2, శనిగరం, పెద్ద పెండ్యాల ఉన్నాయన్నారు. వివిధ శాఖలతో కలెక్టర్ రా జీవ్గాంధీ హన్మంతు ఇటివల సమావేశం ఏర్పాటు చేసి ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా సమన్వయంతో పని చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏసీజీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
సీసీ నిఘాలో ప్రశ్నాపత్రం ఒపెన్
పరీక్ష పేపర్ లీకేజీలకు తావు లేకుండా సెంటర్లో ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా గదిలోనే చీఫ్ సూ పరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ సమక్షంలో ప్రశ్నాపత్రంను ఒపెన్ చేస్తారు. 71 కేంద్రాల్లో 31 ప్రైవేట్ సెంటర్స్, 40 ప్రభుత్వ కేంద్రాలు ఉండగా, విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇన్విజ లేటర్ నుంచి సీఎస్, డీవో, ప్లయింగ్ స్వాడ్లు ప్రతి ఒక్కరూ విధిగా మెడలో ఐడి కార్డు ధరించాలన్నారు.
పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు..
డీఈవో 7995087621, ఎంఈవో హనుమకొండ, కాజీపేట్, హసన్పర్తి, కమలాపూర్ 9848510359
ఎంఈవో ఎల్కతుర్తి 7013219251, ఎంఈవో భీమదేవరపల్లి, వేలేరు, ఐనవోలు, ధర్మసాగర్ 970424 5068, ఎంఈవో ఆత్మకూర్, దామెర, పర్కాల, శాయంపేట, నడికూడ 9948944120