కాశీబుగ్గ, ఫిబ్రవరి 8 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు మూడు రోజులు సెలవులు ఇస్తున్నట్లు కార్యదర్శి క్యారం సంగయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 9న శుక్రవారం అమావాస్య, శనివారం యార్డు బంద్, ఆదివారం వారాంతపు సెలవు అని పేర్కొన్నారు.
సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు తీసుకొచ్చి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.