హనుమకొండ, డిసెంబర్ 31 : హంటర్రోడ్డులోని కాకతీయ జూపార్కు సోమవారం తెరిచే ఉంటుందని ఇన్చార్జి వీ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. జూపార్కుకు ప్రతి సోమవారం సెలవు అయినప్పటకీ జిల్లా అటవీ శాఖ అధికారి లావణ్య ఆదేశాల మేరకు నూతన సంవత్సరం సందర్భంగా సందర్శకుల కోసం తెరిచి ఉంటుందన్నారు.