తాడ్వాయి, ఫిబ్రవరి 12 : పశువులతో కలిసి గ్రామంలోకి వచ్చిన కొండగొర్రె పిల్లను గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు అప్పగించారు. మండలంలోని కాటాపురం గ్రామానికి చెందిన పశువుల కాపరి సోమవారం పశువులను గ్రామ సమీపంలోని అడవిలోకి మేతకు తీసుకువెళ్లాడు.
తిరిగి పశువులు ఇంటికి వస్తున్న క్రమంలో వాటితో పాటు కొండగొర్రె పిల్ల గ్రామంలోకి వచ్చింది. గమనించిన స్థానికులు ఫారెస్టు బీట్ అధికారి కుడుములు బక్కయ్యకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు గ్రామానికి చేరుకొని పశువుల కాపరి నుంచి దానిని స్వాధీనం చేసుకున్నారు. చిన్న పిల్ల కావడంతో దానిని హనుమకొండలోని జూపార్క్కు తరలిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.