ఖిలావరంగల్, జనవరి 26: జిల్లావ్యాప్తంగా గురువారం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్నంటాయి. కలెక్టరేట్లో కలెక్టర్ గోపి జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం తర్వాత జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గీసుగొండ కేజీబీవీ, చింతల్ వీనస్ స్కూల్ విద్యార్థులు దేశభక్తిని పెంపొందించే పాటలకు నృత్యాలు చేశారు. దేశ సమగ్రత, సౌభ్రాతృత్వానికి అద్దంపట్టేలా చేసిన నృత్యాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులను అభినందించారు.
ఖిలావరంగల్/పోచమ్మమైదాన్/నర్సంపేటరూరల్/వర్ధన్నపేట: వరంగల్ పడమరకోటలో జాతీయ జెండాను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆవిష్కరించారు. వరంగల్ గోపాలస్వామి గుడి సమీపంలో మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో నన్నపునేని పాల్గొన్నారు. అలాగే, ఆటోనగర్లో కాకతీయ ఆటోనగర్ ఆధ్వర్యంలో ఆయన పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. నర్సంపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వర్ధన్నపేట మండలకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ఖిలావరంగల్/వరంగల్చౌరస్తా/గిర్మాజీపేట/కరీమాబాద్: వరంగల్ 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్యాదవ్, 37వ డివిజన్లో కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు విజయ్, మాజీ అధ్యక్షుడు చందర్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, తహసీల్లో తహసీల్దార్ ఫణికుమార్, వరంగల్ రైల్వేస్టేషన్లో స్టేషన్ మేనేజర్ శ్రీనివాస్, రైల్వే పోలీస్స్టేషన్లో సీఐ నరేశ్, ఆర్పీఎఫ్ స్టేషన్లో సీఐ టీఎస్ఆర్ మూర్తి, శివనగర్ ఏకశిల డీజీ స్కూల్లో డైరెక్టర్ కొండల్రెడ్డి జెండాను ఆవిష్కరించారు. కోటలోని కేంద్ర పురావస్తుశాఖ ప్రాంగణంలో 50 అడుగుల జాతీయ జెండాను ఉద్యోగి భుజేందర్రావు ఆవిష్కరించారు. 17వ డివిజన్ ఆదర్శనగర్, వసంతపురంలో కార్పొరేటర్ గద్దె బాబు జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో వీసీ డాక్టర్ కరుణాకర్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంజీఎంలో సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాలలో ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేఎంసీ సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్రావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఐఎంఏ భవనంలో అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్, 36వ డివిజన్ చింతల్లో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్వో కే వెంకటరమణ, జిల్లా విద్యాశాఖాధి కార్యాలయంలో డీఈవో డీ వాసంతి, ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్లో సీఐ మల్లేశ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో డీఐఈవో కాక మాధవరావు, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో అధికారి ఎం శారద, 25, 26, 28, 33వ డివిజన్లో కార్పొరేటర్లు బస్వరాజు శిరీషా శ్రీమాన్, బాలిన సురేశ్, గందె కల్పనా నవీన్, ముష్కమల్ల అరుణా సుధాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అండర్రైల్వేగేట్ ప్రాంతంలోని 32, 39, 40, 41, 42, 43 డివిజన్లో కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన, ఈదురు అరుణ జెండాలను ఎగురవేశారు. పీఏసీఎస్లో చైర్మన్ కేడల జనార్దన్, మామునూరు ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ నరేశ్కుమార్, మామునూరు పీటీసీలో ప్రిన్సిపాల్ పూజ, 4వ బెటాలియన్లో కమాండెంట్ శివప్రసాద్రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.
కాశీబుగ్గ/పోచమ్మమైదాన్: వరంగల్లోని 3, 14, 18, 19, 20 డివిజన్లలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్, చాంబర్ ఆఫ్ కామర్స్ భవనం, పాత పండ్ల మార్కెట్, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు, సంరక్ష సూపర్స్పెషాలిటీ దవాఖానలో నిర్వహించిన వేడుకల్లో కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, జన్ను షీభారాణి, తూర్పాటి సులోచన, చాంబర్ అధ్యక్ష కార్యదర్శులు బొమ్మినేని రవీందర్రెడ్డి, వేద ప్రకాశ్, మార్కెట్ కమిటీ ఉద్యోగులు, డాక్టర్ పోలా నటరాజు, డాక్టర్ తౌటు భాస్కర్, సామ్యూల్, వెల్ది సాంబయ్య, దొంగల చెన్నమల్లు పాల్గొన్నారు. వరంగల్ గోపాలస్వామి గుడి వద్ద మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ పాల్గొన్నారు. 12వ డివిజన్లో కార్పొరేటర్ కావటి కవితా రాజు యాదవ్, 13వ డివిజన్లో కార్పొరేటర్ సురేశ్కుమార్ జోషి, 21వ డివిజన్లో కార్పొరేటర్ ఫుర్కాన్, 22వ డివిజన్లో కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి జాతీయ పతాకాలను ఎగురవేశారు. వరంగల్ తహసీల్లో తహసీల్దార్ సత్యపాల్రెడ్డి, దేశాయిపేట సీకేఎం కాలేజీలో ప్రిన్సిపాల్ శశిధర్రావు, ఎల్బీ నగర్లోని లర్నర్స్ల్యాండ్ హైస్కూల్లో కరస్పాండెంట్ తాళ్ల మల్లేశం, ప్రభుత్వ చార్బౌళి పాఠశాలలో హెచ్ఎం కవిత, స్కాలర్స్ హైస్కూల్లో ఎస్ వెంకట్రాజం, తిలక్రోడ్డులో మహిళా సంఘం అధ్యక్షురాలు ముష్కె ప్రమీల, పోచమ్మమైదాన్లో తెలంగాణ ఉద్యమకారిణి రహిమున్నీసాబేగం, కొత్తవాడలో సీపీఐ నాయకులు వెంకట్రాములు, దేశాయిపేట ఎస్ఆర్ భవనం ఆవరణలో ట్యానరీ అండ్ లెదర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వేజ్బోర్డు మాజీ చైర్మన్ జన్ను జఖర్య త్రివర్ణ పతకాలను ఎగురువేశారు. ఇన్నర్వీల్ క్లబ్లో యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కమిషనర్ ఏవీ రంగనాథ్ జాతీయ జెండా అవిష్కరించి పోలీస్ వందనం స్వీకరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. డీసీపీలు ఆశోక్కుమార్, వెంకటలక్ష్మి, అదనపు డీసీపీలు వైభవ్ గైక్వాడ్, సంజీవ్, సురేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణితో కలిసి కమిషనర్ ప్రావీణ్య జాతీయ జెండాను ఎగురవేశారు. వేడుకల్లో కార్పొరేటరు, అదనపు కమిషనర్ రవీందర్, డిప్యూటీ కమిషనర్లు అనీసుర్ రషీద్, శ్రీనివాస్రెడ్డి, జోనా, ఎప్ఈలు కృష్ణారావు, ప్రవీణ్ చంద్ర పాల్గొన్నారు. పబ్లిక్ గార్డెన్లోని టౌన్ హాల్పై గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య మేయర్ గుండు సుధారాణితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.