వరంగల్ : గ్రామాలు అభివృద్ధి చెందుతేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని భావించి సీఎం కేసీఆర్ గ్రామాలకు అత్యధిక నిధులు మంజూరు చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలం తిమ్మాపూర్ గ్రామంలో వివిధ శాఖల అధికారులతో కలిసి గురువారం పర్యటించారు.
పర్యటనలో భాగంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన రూ.12.60 లక్షలతో స్మశానవాటిక, రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డ్, రూ.5 లక్షలతో పల్లె ప్రకృతివనం, రూ.46 లక్షలతో బృహత్ పల్లె ప్రకృతివనానని ప్రారంభించారు.