ప్రజల బాగు కోసం పరితపిస్తూ తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర సర్కారు వేసిన రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ రోడ్లు సరికొత్త హంగులతో కళకళలాడుతున్నాయి. నల్లబెల్లి మండలం నుంచి దుగ్గొండి మీదుగా వరంగల్ రోడ్డును గిర్నిబావి వద్ద కలుపుతూ ఆర్అండ్బీ అధికారులు నిర్మించిన డబుల్ రోడ్డు జాతీయ రహదారిని తలదన్నేలా ఉన్నది. నల్లబెల్లి నుంచి ఓరుగల్లు నగరానికి వెళ్లేందుకు దూరమూ తగ్గడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– నర్సంపేట, మార్చి 29
నర్సంపేట, మార్చి 29 : జిల్లాలోని జాతీయ రహదారి 365 అధ్వానంగా తయారైంది. అదే రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్లు సూపర్గా ఉన్నాయి. నాణ్యతా ప్రమాణాలతో నిర్మించడంతో ప్రజలకు సౌకర్యంగా ఉంటున్నాయి. కేంద్రం నిధులు కేటాయించక పోవడంతో జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
గుంతలమయంగా ఎన్హెచ్ 365..
2013-14లో కేంద్ర ప్రభుత్వం సిరొంచ నుంచి రేణిగుంట వరకు జాతీయ రహదారి 365 మంజూ రు చేసింది. మల్లంపల్లి నుంచి మంగళవారిపేట వర కు రూ.105 కోట్లు, మంగళవారిపేట నుంచి నకిరేకల్ వరకు రూ. 385 కోట్లు కేటాయించింది. మూడు సం వత్సరాల తర్వాత ఈ రోడ్డు నిర్మాణ పనులు 2017లో ప్రారంభమయ్యాయి. ఖానాపురం మండ లం వరకు మొదటి విడుత పూర్తి చేశారు.
ఖానాపురం మండలంలోని మంగళవారిపేట నుంచి మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి వరకు 33 కిలోమీటర్ల రోడ్డు పనుల్లో చాలా చోట్ల అసంపూర్తిగా వదిలేశారు. వేపచెట్టు తండా, మంగళవారిపేట గ్రామాల్లో మొదలే పెట్టలేదు. వేపచెట్టు తండా వద్ద వ్యవసాయ భూముల్లోంచి రోడ్డు నిర్మాణం కోసం కంకర పోశారు. వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా మధ్యలోనే వదిలేశారు. దీంతో పాత రోడ్డుపైనే ప్రస్తుతం వాహనాలు వెళ్తున్నాయి. 2021లోనే రోడ్డు పనులు పూర్తి కావాల్సి ఉంది. గడువు ముగిసి ఇప్పటికి రెండేళ్లు గడుస్తున్నది. అయినా ఎన్హెచ్ఏఐ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు. వేపచెట్టు తండా వద్ద రోడ్డు నిర్మాణ స్థలంలో రైతులు మక్కజొన్న పంటను సాగు చేసుకుంటున్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వం వేసిన రోడ్డును కూడా మెయింటనెన్స్ చేయడం లేదు.
సరికొత్తగా ఆర్అండ్బీ రోడ్డు..
రాష్ట్ర ప్రభుత్వం ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ రోడ్లకు నిధు లు కేటాయించి సూపర్గా నిర్మిస్తున్నది. నల్లబెల్లి మం డలం నుంచి దుగ్గొండి మీదుగా వరంగల్ రోడ్డును గిర్నిబావి వద్ద కలుపుతూ ఆర్అండ్బీ అధికారులు డబుల్ రోడ్డు నిర్మించారు. దీంతో పల్లెలు కళకళలాడుతున్నాయి. నల్లబెల్లి, దుగ్గొండి మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్, డివైడర్లు కూడా నిర్మించారు. రూ.15 కోట్లతో 10 కిలోమీటర్లు పొడవున్న ఈ రోడ్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే, ఈ రెండు మండలాలను కలుపుతూ లింక్ రోడ్లను పూర్తి చేశారు. వరంగల్కు నేరుగా ఈ రోడ్డు ద్వారా ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడింది.