వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 25 : ఏసు ప్రభువు చూపిన శాంతిమార్గంలో నడువాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం 27వ డివిజన్ గిర్మాజీపేటలోని ఎల్-రోయ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం మైనార్టీలకు తగిన గుర్తింపు లభించిందన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.
36వ డివిజన్లో..
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 36వ డివిజన్ చింతల్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నింటాయి. బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మసూద్ హాజరై క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సర్వమత సమానత్వాన్ని కొనసాగిస్తున్నదన్నారు.
పోచమ్మమైదాన్లో..
పోచమ్మమైదాన్ : ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా దేశాయిపేటలోని సీఎస్ఐ చర్చిలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచానికి దిక్సూచి అని అన్నారు. ఆయన కరుణ, సేవాగుణం, శాంతి, సహనం ప్రేమతో జీవనగమనం నేటి తరానికి ఎంతో ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సురేశ్కుమార్ జోషి పాల్గొన్నారు. అలాగే 22వ డివిజన్లోని చర్చిలో ఎమ్మెల్యే నన్నపునేని పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, నాయకులు మావురపు విజయభాస్కర్రెడ్డి, జూపాక సురేశ్ పాల్గొన్నారు. 21వ డివిజన్ లోతుకుంట చర్చిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేందర్, కార్పొరేటర్ ఎండీ ఫుర్ఖాన్ పాల్గొన్నారు.
ఖిలావరంగల్లో..
ఖిలావరంగల్ : క్రిస్మస్ సందర్భంగా చర్చిలను విద్యుత్ దీపాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆదివారం ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పడమరకోటలోని చర్చిలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో 37, 38 డివిజన్ల కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, బోగి సురేశ్, నలిగంటి నవీన్, మేకల ఎల్లయ్య, నలిగంటి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. ఏసీరెడ్డినగర్ న్యూ లైఫ్ జీసస్ చర్చిలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే నరేందర్ హాజరై కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, వసుల బాబు తదితరులు పాల్గొన్నారు.
కోటలో ఉచిత వైద్య శిబిరం
ఖిలావరంగల్ పడమర కోటలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నిర్వాహకుడు అనిల్ను అభినందించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్యాదవ్, బీఆర్ఎస్ నాయకుడు ఇనుముల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.