ఉమ్మడి జిల్లాకు చెందిన మహాకవి బమ్మెర పోతనను పాలకులు మరిచారు. ఆయన రచించిన భాగవతాన్ని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో వరంగల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియం మూడేళ్లుగా మూతపడి ఉంది. ప్రస్తుతం దాని నిర్వహణ బాధ్యత ఎవరు చేయాలనే దానిపై అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది.
– వరంగల్, అక్టోబర్ 4
15 ఏప్రిల్ 2022న బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోతన డిజిటల్ మ్యూజియాన్ని ప్రారంభించారు. రూ. కోటితో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో ఏర్పాటు చేయగా మూడేళ్లుగా నిరుపయోగంగా పడి ఉంది. దీని నిర్వహణ భాద్యత ఎవరిదనే సందిగ్దం నెలకొంది. పోతన విజ్ఞాన పీఠం ఆవరణలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నిర్మా ణం పూర్తి చేసి వదిలివేశారు. టూరిజం శాఖ నిర్వహణ చేపట్టాలని నిర్ణ యించినా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం పోతన విజ్ఞాన పీఠం ఆధీనంలో ఉండగా, నిర్వహణ బాధ్యత ఎవరు తీసుకోవాలనే దానిపై అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకోవడం లేదు.
ప్రచారం కరువు
బమ్మెర పోతన డిజిటల్ మ్యూజియానికి ప్రచారం కల్పించడంలో అధికార యంత్రాంగం విఫల మైంది. ఇప్పటి వరకు పెద్దగా సందర్శకులు, విద్యార్థులు వచ్చిన దాఖలాలు లేవు. పోతన డిజిటల్ మ్యూజియం ఉందన్న విషయం చాలా వరకు తెలియదంటే అతియోశక్తి కాదు. ని ర్వహణ బాధ్యతలను పర్యాటక శాఖకు అ ప్పగించి విస్తృత ప్రచారం కల్పిస్తే పెద్ద ఎత్తు న సందర్శకులు వచ్చే అవకాశాలున్నాయి.
ఆధునిక సాంకేతికత
బమ్మెర పోతన మ్యూజియంలో ఆధునిక సాంకేతికను వినియోగించారు. ఆయన రచించిన భాగవతం లోని ఏ అధ్యాయం చదవాలన్న డిజిటల్ స్క్రీన్పై చూడొచ్చు. ఇందుకోసం సుమారు 15 స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సందర్శకుల కోసం విశాలమైన హాల్, సీటింగ్ ఏర్పాటు చేశారు. మ్యూజియం ప్రా రంభంలో పెద్ద స్క్రీన్పై ‘పలికెడిది భాగవతమట.. పలికించేవాడు రామచంద్రుడట’ పద్యంతో పాటు బమ్మెర పోతన, శ్రీరాముడి ఫొటో ఉన్న పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది. పూర్తి ఏసీతో ఏర్పాటు చేసిన పోతన మ్యూజియం అధికార యంత్రాగం నిర్లక్ష్యంతో మూతపడి ఉంది.
సిబ్బందిని నియమించాలి
మ్యూజియం ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న కుడా ధికారులు నిర్వహణ కోసం సిబ్బందిని నియ మించడం మరిచారు. ప్రస్తుతం అప్పుడప్పుడు పోత న విజ్ఞాన పీఠం సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. సందర్శకులకు పోతన భాగవతాన్ని వివరించేందుకు గైడ్తో పాటు డిజిటల్ మ్యూజియం నిర్వహణ చేసేలా కేర్ టెకర్, అటెండర్లను నియమించి పూర్తిస్థాయిలో అం దుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఉ మ్మడి జిల్లాకు చెందిన మహాకవి బమ్మెర పోతన రచించిన భాగవతం సారాంశం భావితరాలకు అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది.