‘పల్లె ప్రగతి’ కొత్త చరిత్రను లిఖించింది. దశాబ్దాలుగా చీకట్లలో మగ్గిన పల్లెల్లో కొత్త వెలుగులను నింపింది. ఒకప్పుడు ఊరంటే పాత ఇండ్లు.. పాడువడ్డ బావులు.. బొందలు పడి మురుగు పారే దారులు.. చెత్తకుప్పలు, మురికి కూపాలతో నిండిన వీధులు.. దోమలు, ఈగలు, క్రిమికీటకాలు ముసురుకున్న పరిసరాలు.. ఎటు చూసినా రొచ్చు కనిపించేది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ‘పల్లె ప్రగతి’తో ఇప్పుడు ఏ గ్రామం చూసినా పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడుతున్నది. ఉమ్మడి జిల్లాలో వందశాతం వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు పూర్తయి ఊర్ల రూపురేఖలే మారిపోయాయి. అద్దాల్లాంటి రోడ్లు, పారిశుధ్య నిర్వహణ, ఆహ్లాదకర వాతావరణం పంచేందుకు పచ్చని చెట్లు, కాసేపు సేదతీరేందుకు ప్రకృతివనాలు, చివరి గమ్యానికి ప్రశాంతంగా చేరుకునేందుకు వైకుంఠధామాలతో ప్రతి పల్లె కొత్తగా కనిపిస్తున్నది.
– వరంగల్, జూన్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, జూన్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పల్లె ప్రగతితో ఊర్లకు కొత్త కళ వచ్చింది. గ్రామాల సమ గ్ర వికాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఈ కార్యక్రమం లక్ష్యాన్ని చేరుకున్నది. పల్లె ప్రగతిలో నిర్దే శించిన అన్ని ప్రమాణాల్లోనూ ఆరు జిల్లాలు ఆదర్శనీ యంగా అభివృద్ధిని నమోదు చేశాయి. పట్టణాలకు, నగరాలకు దీటుగా గ్రామాల్లో మౌలిక వసతులు అందు బా టులోకి వచ్చాయి.
వంద శాతం వైకుంఠధామాలు..
మనిషి జీవితం ఎలా ఉన్నా చివరి మజిలీ ప్రశాంతం గా పూర్తి కావాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ప్రతి ఊరిలో వైకుంఠధామాలు (శ్మశానవాటిక) నిర్మించింది. మనిషి చనిపోయిన సందర్భాల్లో అంత్యక్రియల కోసం భూమి లేనప్పుడు ఆ కుటుంబాల పరిస్థితి దయనీ యంగా ఉంటుంది. కొన్ని గ్రామాల్లో శ్మశానవాటికలు ఉన్నా మౌలిక వసతులు లేకపోయేటివి. నీటి సరఫరా, మహిళలకు దస్తులు మార్చుకునే గది, ఇతర వసతులు అసలే లేకుండేవి. ఈ పరిస్థితిని మార్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వైకుంఠధామాల నిర్మా ణం వంద శాతం పూర్తయింది. ఉమ్మడి జిల్లాలో 1688 పంచాయతీలుండగా 1619 వైకుంఠధామాలు నిర్మించా రు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికా రుల నిరంతర పర్యవేక్షణతోనే ఇది సాధ్యమైంది.
ఊర్లు శుభ్రం..
పల్లెలను స్వచ్ఛతకు కేంద్రాలుగా మార్చాలన్న సంక ల్పంతో సీఎం కేసీఆర్ డంపింగ్ యార్డులకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఊరిలో నిరంతరం పారిశుధ్య నిర్వహణ ఉండాలని జీపీ కార్మికుల వేతనాన్ని రూ.8500కు పెంచారు. ప్రతి ఇంటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. గ్రామాలు శుభ్రంగా ఉండేలా ప్రణాళిక రూపొదించారు. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ను అందుబాటులోకి తెచ్చా రు. ట్రాలీని సమకూర్చి చెత్తను ఊరి అవతలికి తరలిస్తు న్నారు. రోజువారీగా సేకరించే చెత్తను డంపింగ్యార్డుకు తరలించి దాన్ని కంపోస్టు ఎరువుగా మార్చే ప్రక్రియ కొనసాగుతున్నది. 1688 పంచాయతీలన్నింటిలోనూ డంపింగ్యార్డుల నిర్మాణం పూర్తికాగా, కంపోస్టు ప్రక్రి య కొనసాగుతున్నది. దీంతో ఊర్లన్నీ పరిశుభ్రంగా ఉంటున్నాయి.
పల్లెల్లో ఆహ్లాదం..
గ్రామాల్లో ప్రజలకు ఆహ్లాదకర వాతావారణం అందించేందుకు ప్రతి ఆవాసంలో పల్లె ప్రకృతి వనాలు నిర్మించారు. ఆరు జిల్లాల పరిధిలోని పంచాయతీల్లో 2,738 ఆవాసాలుండగా 2,700 పల్లె ప్రకృతి వనాల నిర్మాణం పూర్తయింది. అన్నింటిలోనూ పూర్తి స్థాయిలో మొక్కలు పెరిగాయి. నిరంతరం నీటి సరఫరా, పర్యవే క్షణతో పల్లె ప్రకృతి వనాలు ఊర్లకు కొత్త అందాలను తెచ్చాయి. శిథిలమైన ఇండ్లు, గోడలను తొలగించడంతో పాటు పాత బావులను పూడ్చివేశారు. అంతర్గత రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి సంరక్షించడంతో అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టి, ట్రీ గార్డులు, సపోర్టు కర్రలు ఏర్పాటు చేసుకున్నారు. వంగిపోయిన, తుప్పు పట్టిన కరంటు స్తంభాలను, వేలాడుతున్న కరంటు వైర్లను సరిచేశారు. వీధిలైట్లకు మూడో వైర్ ఏర్పాటు చేయడమే కాకుండా ఎల్ఈడీ లైట్లు బిగించారు. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటిస్తున్నారు. ఒకవేళ గ్రామం అపరిశుభ్రంగా ఉంటే సదరు సర్పంచ్లకు కలెక్ట ర్లు నోటీసులు జారీ చేస్తూ పంచాయతీ కార్యదర్శులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. ఇవన్ని చర్యలు చేపట్టడంతో గత వానకాలంలో రోగాలు పల్లెల దరి చేరలేదు. డెంగీ, మలేరియా, డయేరియా, చికున్గున్యా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు చాలామట్టు కు దూరమయ్యాయి. పల్లె ప్రగతి చర్యల ద్వారా ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలు జాతీయ స్థాయిలో అవార్డులు సైతం అందుకున్నాయి.
పల్లె ప్రగతి దినోత్సవానికి ఏర్పాట్లు
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ‘తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపే పలు కార్యక్రమాలు ఉంటాయి. అవార్డు సాధించిన ఉత్త మ గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉత్తమ మండలా ల ఎంపీపీలను సన్మానించనున్నారు.