ఓ వైపు శాంతిభద్రతల పరిరక్షణకు విశేష కృషిచేస్తూనే మరోవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు చేరువై పోలీసు శాఖ తనదైన ముద్రవేసుకున్నది. సమైక్య సర్కారుకు భిన్నంగా కొంగొత్త విధానాలు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సమర్థవంతమైన సేవలతో స్వరాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మెరుగుపడింది. మత ఘర్షణలకు తావులేకుండా ప్రశాంతమైన జీవనం గడిపేలా భద్రతకు భరోసానిస్తున్న ఫలితంగా అభివృద్ధి వేగంగా జరుగుతున్నది. ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు ఆనుగుణంగా పనిచేస్తూనే కేసుల పరిష్కారం, సైబర్ నేరాల నియంత్రణలో వరంగల్ కమిషనరేట్ మొదటి వరుసలో ఉన్నది. అంతేగాక బాధితులకు చేయూతనిస్తూ యువతకు జాబ్మేళాలు, ప్రజలను అప్రమత్తం చేసే అవగాహన కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నది. ఈ మేరకు పోలీస్ శాఖ అందిస్తున్న సేవల నేపథ్యంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సురక్షా దినోత్సవం నిర్వహించనుండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
వరంగల్, జూన్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా తొమ్మిదేండ్లలో పోలీసుల పనితీరు మెరుగుపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలకు భిన్నంగా ఉన్నత ఆలోచనతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రజలు, పోలీసులు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించే లక్ష్యం తో పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించే విధానాన్ని అమల్లోకి తెచ్చిం ది. దీనితో ఫిర్యాదుదారులకు భరోసా కలుగుతున్నది. మహిళల కోసం ప్రతి పోలీస్స్టేషన్లో ఉమెన్ హెల్ప్డెస్క్లను ఏర్పాటుచేసింది. ఆన్లైన్, సోషల్ మీడియా, డయల్ 100కు వచ్చే ఫిర్యాదులపై పోలీసు శాఖ తక్షణమే స్పందిస్తూ ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చింది. మహిళను వేధింపులకు గురిచేసే ఆకతాయిల భరతం పట్టేందుకు ప్రత్యేకంగా షీ టీంలను ఏర్పాటు చేసింది. అపదలో ఉన్న మహిళలకు తక్షణ సాయం చేసేందుకు వీలుగా హాక్ ఐ లాంటి సెల్ఫోన్ అప్లికేషన్ను వినియోగంలోకి తెచ్చింది. లైంగిక వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు అసరాగా నిలిచేందుకు భరోసా కేంద్రాల ఏర్పాటుచేసింది. పోలీసు ఉద్యోగ నియమాకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుచేస్తున్నది. ప్రజలకు పోలీసులు అనునిత్యం దగ్గరగా ఉండడంతో పాటు శాంతిభద్రతలపై ప్రజలకు భరోసా కల్పించేందుకు, సత్వర సహాయాన్ని అందించేందు రాష్ట్ర ప్రభుత్వం ‘డయల్ 100’ను అమలులోకి తెచ్చింది. తద్వారా అందిన ఫిర్యాదులుపై ఐదు నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తున్నారు. శాంతిభద్రతలు మెరుగ్గా ఉండడంతో అభివృద్ధి