ఆ చెట్టు చెప్పుడో ఎండిపోయింది.. మోడువారిన కొమ్మలు మాత్రమే మిగిలాయి. ఎక్కడి నుంచి వచ్చిందోగానీ మంగళవారం ఓ పిట్టల గుంపు ఆ చెట్టు కొమ్మలపై వాలి పిట్టలే చెట్టుకు కాశాయా అన్నట్లుగా కనిపించాయి. హనుమకొండలోని బస్టాండ్ సమీపంలో ఈ ‘పిట్టల చెట్టు’ స్థానికులను ఎంతగానో ఆకర్శించింది.