లక్షలాదిగా తరలివచ్చిన బిడ్డలకు దీవెనలందించిన అమ్మవార్లు శనివారం సాయంత్రం వన ప్రవేశం చేశారు. భక్తుల జయజయధ్వానాల నడుమ, ఉద్విగ్న వాతావరణంలో చిలుకలగుట్టకు సమ్మక్కను, కన్నెపల్లికి సారలమ్మ, పూనుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజులను పూజారులు తీసుకెళ్లారు. వన ప్రవేశం తర్వాత కూడా భక్తులు పెద్ద ఎత్తున తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు.
నాలుగు రోజులపాటు భక్తుల పూజలందుకున్న తల్లుల వన ప్రవేశంతో మేడారం మహాజాతర ముగిసింది. కనుచూపు మేర భక్తులతో కిటకిటలాడిన మేడారం పరిసరాలు ఖాళీ అవుతున్నాయి. ‘సల్లంగ చూడు తల్లీ.. రెండేళ్లకు మళ్లొస్తాం’ అంటూ భక్తులు తిరుగు పయనమయ్యారు. శనివారం సాయంత్రం ఆదివాసీ సంప్రదాయలతో పూజారులు(వడ్డెలు) అమ్మవార్ల ను వనంలోకి తీసుకెళ్లారు. ముందుగా మేడారం సమ్మక్క పూజారులంతా ప్రధాన పూజారి సిద్దబోయిన మునీందర్ ఇంటికి చేరుకున్నారు. అనంతరం సమ్మక్క గద్దె వద్దకు వెళ్లి ఆడపడుచులు అలుకుపూతలు వేసి, సమ్మక్క తల్లిని డోలివాయిద్యాలు, లక్షలాది భక్తుల జయజయధ్వానాల నడుమ వనంలోకి తీసుకెళ్లారు. జాతర చివరి రోజు లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చివరి రోజున భారీగా జనం తరలివచ్చారు. దేవతల వన ప్రవేశం తర్వాత కూడా మొకులు చెల్లించుకున్నారు.
దేవతల వనప్రవేశం ఉద్విగ్నంగా సాగింది. ఆదివాసీ పూజారులు డోలివాయిద్యాలతో గద్దెలపైకి చేరుకోగా ప్రాంగణమంతా భక్తులతో కోలాహలంగా మారింది. దర్శనాలను పూర్తిగా నిలిపివేసిన తర్వాత శనివారం సాయంత్రం దేవతల వన ప్రవేశ ఘట్టం మొదలైంది. మొదట గోవిందరాజులును అర్రెం వంశీయుల నేతత్వంలోని పూజారుల బృందం మేడారం గద్దెల నుంచి సరిగ్గా సాయంత్రం 6.52 గంటలకు కొండాయికి తరలించారు. సారలమ్మ గద్దెపై పూజారులు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత, అక్కడ ప్రతిష్ఠించిన మెంటె(వెదురుబుట్ట)ను రాత్రి 7.33 గంటలకు తీసుకుని జంపన్నవాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. సమ్మక భర్త పగిడిద్దరాజును సాయంత్రం 6.48 గంటలకు పెనక బుచ్చిరాములు నేత్వత్వంలోని పూజారుల బృందం మేడారం నుంచి కొత్తగూడ మండలం పూనుగొండ్లకు తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం వరకు వీరు తమ గమ్యాన్ని చేరుకోనున్నారు. సమ్మకను గద్దెల నుంచి కొకెర కష్ణయ్య నేతత్వంలోని పూజారుల బృందం గద్దెల వద్ద పూజలు నిర్వహించి అకడి నుంచి కదిలించి రాత్రి 7.10 గంటలకు వనంలోకి తీసుకెళ్లారు. గద్దెల సమీపంలోని ఎదురోళ్ల ప్రదేశం వద్ద మేక బలితో పూజలు చేసి, అకడి నుంచి సమ్మకను చిలుకలగుట్టకు చేర్చారు. దేవతల వనప్రవేశంతో మేడారం మహా జాతర అధికారింగా ముగిసింది. వచ్చే బుధవారం మేడారం పూజారులు చేసే తిరుగువారం పండుగతో మహాజాతర అంకం పరిసమాప్తమవుతుంది.