సంగెం,ఫిబ్రవరి 20 : రోడ్డు ప్రమాదంలో తనయుడు మృతి చెందగా, తండ్రి గాయపడిన ఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పర్వతగిరి మండలం మాల్యా గ్రామపంచాయతీ పరిధిలోని పంచరాయి తండాకు చెందిన బానోత్ వెంకన్న కుమారుడు శివ(12) పున్నేలులోని పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. మహాశివరాత్రి పండుగకు వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం పాఠశాలకు వెళ్లేందుకు బైక్పై తండ్రి వెంకన్నతో కలిసి వెళ్త్తున్నాడు.
ఈ క్రమంలో సంగెం మండలం గవిచర్ల శివారులో వరంగల్ నుంచి అతివేగంగా వస్తున్న టాటా గూడ్స్ వాహనం బైక్ను ఢీకొంది. దీంతో వెంకన్న గాయపడగా, శివ అక్కడిక్కడే మృతి చెందాడు. వెంకన్నకు చేతికి, కాలుకు గాయాలయ్యాయి. వెంకన్న హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. రోడ్డు ప్రమాద సమాచారం తెలుసుకున్న సంగెం ఎస్సై రాకేశ్రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నాడు. శివ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాకేశ్రెడ్డి తెలిపారు.