బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో.. అంటూ మహిళలు పూల పండుగలను వైభవంగా జరుపుకున్నారు. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఆటపాటలతో సందడి చేశారు.
పరకాల, అక్టోబర్ 14: తెలంగాణ సంస్కృతి సంప్ర దాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ అంగ రంగ వైభవంగా ప్రారంభైమెంది. పరకాల పట్టణంలోని పశువుల సంత ఆవరణలో ఎంగిలిపూల బతుకమ్మకు పాలకవర్గం ఏర్పాట్లు చేయగా పహిళలు, యువతులు భారీ ఎత్తున బతుకమ్మ ఆడేందుకు తరలివచ్చారు. బతుకమ్మలను ఒక చోట చేర్చి ఆడిపాడారు. ఈ సంద ర్భంగా మహిళలు ఒకరికి ఒకరు వాయినాలను ఇచ్చి పుచ్చుకున్నారు.
దామెర: మండలంలోని అన్ని గ్రామాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రంగురంగుల పూలతో పేర్చి బతుకమ్మను పేర్చి గౌరమ్మను మధ్యలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలు, బొడ్రా యిల వద్ద మహిళలు బతుకమ్మలను ఉంచి ఆడిపాడా రు. కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ నా యినేని సంపత్రావు, కరస్పాండెంట్ కళింగరావు, ప్రిన్సి పాల్ స్నిగ్ధ రంజిత్, ఎంపీపీ కాగితాల శంకర్, జడ్పీటీసీ కల్పన, వైస్ ఎంపీపీ జాకీర్అలీ, పీఏసీఎస్ చైర్మన్ బొల్లు రాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గండు రామకృష్ణ, స ర్పంచ్లు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: మండలంలోని అన్ని గ్రామాల మహిళ లు బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా జరుపు కున్నారు. తీరొక్క పూలతో ఎంగిలిపూల బతుకమ్మను పే ర్చారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ఆలయాల్లో బతుకమ్మలను ఒక దగ్గరికి చేర్చి ఆటాపాటలతో ఆకట్టుకున్నారు.
నడికూడ: మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలను అలంకరించి కూడళ్ల వద్దకు తీసుకెళ్లి సామూహికంగా మహిళలు ఆడి పాడారు. అదేవిధంగా పితృఅమావాస్య సందర్భంగా పితృ దేవతలకు పూజలు చేశారు.
గీసుగొండ: మండలంతో పాటు గ్రేటర్ వరంగల్ 15,16వ డివిజన్లలో శనివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు తీరొక్క పూలను సేకరించి అందంగా బతుకమ్మలను పేర్చి తమ ఇండ్ల నుంచి బతుకమ్మలను తరలివచ్చి గ్రామాల్లో బొ డ్రాయి వద్ద, ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఒక దగ్గ ర చేర్చి పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు.
శాయంపేట: మండలంలోని అన్ని గ్రామాల్లో బతుక మ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు, యువ తులు ఉత్సాహంగా పూలతో బతుకమ్మలను పేర్చి పూ జించారు. సాయంత్రం బతుకమ్మలు చేతబట్టి ఆలయా లకు వెళ్లి అకడ బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడు తూ ఆడారు. అనంతరం మహిళలు ఒకరికొకరు వాయి నాలు ఇచ్చి పుచ్చుకున్నారు. శాయంపేటలోని మత్స్యగిరి స్వామి ఆలయంలో ఎంగిలి పూల బతుకమ్మ వైభవంగా జరిగింది. ఆలయంలో బతుకమ్మలతో నిండి పోయి పూలవనం పరిచినట్లుగా ఆకట్టుకుంది. ఆలయ చైర్మన్ సామల భిక్షపతి ఏర్పాట్లు చేశారు.
సంగెం: మొండ్రాయి గ్రామంలో ఎంగిలిపూల బతుక మ్మ వేడుకలకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీ మణి చల్లా జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్బంగా తీరొ క్క పూలతో ఆడబిడ్డలు జరుపుకునే పండుగను గ్రామం లోని మహిళలు ఆటాపాటలతో ర్యాలీగా తరలివెళ్లారు. కోలాటాలతో మహిళలు ఆడిపాడారు.
కార్యక్రమంలో ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, నిమ్మగడ్డ కల్యాణీవెంకటేశ్వర్రావు, మహిళా ప్రజాప్రతి నిధులు కొనకటి రాణి, గుగులోత్ వీరమ్మ, ఇజ్జగిరి స్వప్న, కట్ల సుమలత, బొమ్మ పావని, శారద, సర్పంచ్ లు గూడ కుమారస్వామి, మేరుగు మల్లేశం, కక్కెర్ల కు మారస్వామి, కందకట్ల నరహరి, వైస్ఎంపీపీ బుక్క మల్ల య్య, సొసైటీ చైర్మెన్లు వేల్పుల కుమారస్వామి, దొమ్మటి సంపత్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కొనకటి రాణి, అను మల ప్రతాప్, దేవేంద్రాచారి, గండ్రకోటి రవియాదవ్తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.