తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరంలో సోమవారం నిర్వహించిన 2కే రన్ ఉత్సాహంగా సాగింది. హనుమకొండ కలెక్టరేట్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు జరిగిన ర్యాలీని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ కమిషనర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు. వరంగల్ తూర్పులోని పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో పోచమ్మమైదాన్ నుంచి ఓ-సిటీ వరకు పరుగుపందాన్ని నిర్వహించగా, కలెక్టర్ ప్రావీణ్య జెండా ఊపి బెలూన్లను గాలిలో వదిలారు. ఈ రన్లో విద్యార్థులు, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, డాక్టర్లు, స్థానిక యువతీయువకులు స్వచ్ఛందంగా పరిగెత్తి ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు.
– హనుమకొండ/పోచమ్మమైదాన్, జూన్ 12
హనుమకొండ, జూన్ 12: తెలంగాణ 2కే రన్లో హనుమకొండ ప్రాంతానికి యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురసరించుకుని వరంగల్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం తెలంగాణ 2కే రన్ను నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు నిర్వహించిన ఈ రన్ను పోలీస్ కమిషనర్ ఏఈ రంగనాథ్, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్లో నగరంలోని విద్యార్థులు, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, డాక్టర్లు, నర్సింగ్ విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, యువతి, యువకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వారికి నగదు పురసారాలను అందజేశారు. కార్యక్రమంలో సీపీ రంగనాథ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు వచ్చాయన్నారు.
మహిళా భద్రత కోసం షీ టీంలను ఏర్పాటు చేశామని, నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. అధునాతమైన వాహనాలు సమకూర్చడంతో పోలీసుల పనితీరులో వేగం పెరుగడంతో పాటు, నేరం జరిగిన క్షణాల్లో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని బాధితులకు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ తెలంగాణలోని యువత ఆరోగ్యం ఉండాలనే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 2కే రన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ట్రైనీ ఐపీఎస్ అంకిత్, డీసీపీలు మురళీధర్, అబ్దుల్ బారి, అదనపు డీసీపీలు సురేశ్ కుమార్, సంజీవ్, ఏసీపీలు కిరణ్ కుమార్, శ్రీనివాస్, జితేందర్రెడ్డి, డేవిడ్ రాజు, నాగయ్య, అనంతయ్య, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, యువత పాల్గొన్నారు.
అభివృద్ధి పథకాల పనితీరు ఆదర్శనీయం
పోచమ్మమైదాన్ : రాష్ట్రంలో తొమ్మిదేళ్లలో చేపట్టిన అభివృద్ధి పథకాల పనితీరు ఆదర్శనీయమని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వరంగల్ తూర్పులోని వరంగల్ పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో పోచమ్మమైదాన్ నుంచి ఓ సిటీ వరకు తెలంగాణ 2కే రన్ను నిర్వహించగా, కలెక్టర్ జెండా ఊపి, బెలూన్లను గాలిలోకి వదలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు విజయవంతం కావడానికి ప్రజల ఆదరణే కారణమన్నారు.
జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో తెలంగాణ రన్ను ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. వరంగల్ తూర్పులో జరిగిన కార్యక్రమానికి యువత, వాకర్స్ అసోసియేషన్, కార్పొరేటర్లు సమన్వయంతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. 2కే రన్ను పోచమ్మమైదాన్ నుంచి ఓ సిటీ ఆజంజాహి మిల్లు వరకు నిర్వహించారు. యువత, వాకర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో మహేందర్జీ, ఏసీపీ బోనాల కిషన్, మట్టెవాడ సీఐ వెంకటేశ్వర్లు, ఇంతెజార్ గంజ్ సీఐ మల్లేశ్, మిల్స్కాలనీ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు, స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, రన్లో గెలుపొందిన వారికి జ్ఞాపికలు అందజేశారు.