పర్వతగిరి, మార్చి 10 : ఏనుగల్లులో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాం పులో మూడు రోజుల్లో 2100 మందికి వైద్య సేవలను అందించినట్లు ప్రతిమ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి ప్రతీక్రావు తెలిపారు. మెగా వైద్య శిబిరం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిమ ఫౌండేషన్, ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఏనుగల్లు చుట్టు పక్కల 18 గిరిజన తండాల మహిళలకు ఉపయోగపడేవిధంగా క్యాంపు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మూడు రోజుల్లో 2100 మందికి ఉచిత వైద్య సేవలు, పలు రకాల పరీక్షలు చేసినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతమైన ఏనుగల్లులో స్క్రీనింగ్ క్యాంపు సక్సెస్ కావడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఆదివాసీ ప్రాంతాలు, ఏటూరునాగారం, ములుగు ట్రైబల్ ఏరియాల్లో ఉచిత స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహిస్తామని చెప్పారు. క్యాంపు విజయవంతానికి సహకరించిన కుటుంబ సభ్యులు, బంధువులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తక్కళ్లపల్లి నారాయణరావు, మాజీ సర్పంచ్ టీ భాస్కర్రావు, మార్కెట్ మాజీ డైరెక్టర్ బోయినపల్లి యుగేంధర్రావు, సర్పంచ్ దమ్మిశెట్టి సంధ్యారాణీనర్సింగం, ఎంపీటీసీ కోల మల్లయ్య, జడ్పీటీసీ సింగ్లాల్, వలంటీర్లకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు 250 మంది మహిళలకు (ప్యాప్స్మియర్) గర్భసంచి క్యాన్సర్ పరీక్షలు, 480 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, 180 మందికి మ్యామోగ్రామ్ పరీక్షలు చేసినట్లు చెప్పారు. 300 మందికి కడుపునకు సంబంధించిన పరీక్షలు, 170 మందికి ఇతర పరీక్షలు విజయవంతంగా చేసినట్లు డాక్టర్ అవినాశ్ తిప్పని వివరించారు. ఈ సమావేశంలో వైద్యులు రాహుల్, సుమిత్ర, లింగమూర్తి, యూత్ అధ్యక్షుడు గూడ నరేందర్ వర్మ, మాసాని వెంకట్, నర్సింగం, భాస్కర్, ప్రతిమ క్యాంపు ఇన్చార్జి మహంతి తదితరులు పాల్గొన్నారు.