మన గ్రామాలు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి రూ.12.65 కోట్లతో పర్వతగిరి మండలంలో పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘పల్లెప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పునర్నిర్మాణం అద్భుతంగా జరుగుతున్నదని వివరించారు. అభివృద్ధిలో ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్గా నిలిపారని, ఇక్కడ పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల సంక్షేమమే సర్కారు ధ్యేయమని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత జరిగిన అభివృద్ధి మన కళ్ల ముందు కనిపిస్తోందని పేర్కొన్నారు.
పర్వతగిరి, అక్టోబర్ 4 : పల్లె ప్రగతే దేశ ప్రగతి అని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో గణనీయమైన అభివృద్ధిని తీసుకువచ్చి దేశానికే ఆదర్శంగా నిలిపారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. బుధవారం మండలంలోని ఏనుగల్లు, మల్యాతండా, తూర్పు తండా, గుగులోతు తండాలో ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి రూ.12.65కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ పల్లెలు దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నాయన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారాయన్నారు. రాష్ట్రంలో దండుగలా ఉన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చిన మహానీయుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
తన స్వగ్రామమైన ఏనుగల్లు గ్రామాన్ని సీఎం కేసీఆర్ సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని పెద్ద చెరువుకు ఎస్సారెస్పీ కెనాల్ నుంచి డైరెక్టుగా సాగు నీటి సరఫరా చేయడానికి, చెరువుకట్ట సుందరీకరణ, పంపింగ్ సిస్టం, కెనాల్ నిర్మాణానికి సుమారు రూ.10కోట్లు ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మూడో సారి లక్ష మెజార్టీ దాటేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నారన్నారు. అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత జరిగిన అభివృద్ది మన కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్కుమార్, అరూరి రమేశ్కు స్థానిక యాదవులు గొర్రె పిల్లను అందించి సత్కరించారు. కార్యక్రమంలో ప్రతిమ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ ప్రతీక్రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బోయినపెల్లి దేవేందర్రావు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జడ్పీటీసీ సింగ్లాల్, ఎంపీపీ కమల, వైస్ ఎంపీపీ రాజేశ్వర్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరావు, బాస్కర్రావు, సర్పంచ్లు విజయ, మోతీలాల్, సంధ్యారాణి, సుజాత, ఎంపీటీసీలు భాస్కర్, కోల మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్లు గొర్రె దేవేందర్, మనోజ్కుమార్గౌడ్, యుగేంధర్రావు, చిన్నపాక శ్రీనివాస్, డాక్టర్ లింగమూర్తి, బాలరాజు, పార్టీ మండల అధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, రైతు విభాగం అధ్యక్షులు బాల్లె వెంకటరాజు, గూడ నరేందర్వర్మ, బూర శ్యామ్, నర్సింగం, మాసాని వెంకట్ పాల్గొన్నారు. కాగా, కోలాటాలు, డప్పు చప్పుళ్లు, డీజే పాటలతో ఏనుగల్లు ప్రజలు బోయినపెల్లి వినోద్కుమార్కు స్వాగతం పలికారు. గజమాలతో సన్మానించారు.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
మడికొండ : వర్ధన్నపేట నియోజకవర్గంఅభివృద్దే తన లక్ష్యమని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 44వ డివిజన్ పరిధి భట్టుపల్లి, కొత్తపల్లి, అమ్మవారిపేట, అల్లీపూర్, ఇందిరమ్మ కాలనీలలో రూ.4.67కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాలు, కాలనీల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నామన్నారు. మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ కంకణాల సంపత్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జైపాల్రెడ్డి పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాం
నయీంనగర్ : ప్రతి కార్యకర్తను బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుందని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హనుమకొండ ప్రశాంత్నగర్లోని ఆయన నివాస ఆవరణలో వర్ధన్నపేట మండలం ల్యాబర్తి, బొక్కలగూడెం గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయన్నారు. అందరు కలిసికట్టుగా పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, ఎంపీటీసీ ఉమాదేవి, మార్కెట్ డైరెక్టర్ రవీందర్రావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సూరారం నిరంజన్, ల్యాబర్తి ఉపసర్పంచ్ కళింగారావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గుడికందుల రాజు, చిక్కొండ యాకయ్య, బత్తిని రాజబాబు నాయకులు