వర్ధన్నపేట, ఏప్రిల్ 22 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల కేంద్రంలోని ఏబీఎస్ ఫంక్షన్హాల్లో శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 83 మందికి రూ.83,9వే,628 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు, 17 మందికి రూ.6.31లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. రంజాన్ పండుగ సందర్భంగా 350 ముస్లిం కుటుంబాలకు కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. కానీ తెలంగాణ ప్రజల మద్దతుతో కేసీఆర్ అన్ని ఇబ్బందులను అధిగమిస్తున్నారన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనే లక్ష్యంతో హిందూ మహిళలకు బతుకమ్మ చీరెలు, ముస్లింలకు రంజాన్, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్రావు, తహసీల్దార్ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ రవీందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి : మత సామరస్యానికి ప్రతీకగా టీఆర్ఎస్ పాలన నిలుస్తున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 115 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 16 మందికి రూ.కోటీ 23లక్షల 64వేల 340 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని మతాల పండుగలకు సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రంజాన్ పండుగ సందర్భంగా మండలంలోని 250 నిరుపేద ముస్లిం కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల పంతులు, జడ్పీటీసీ బానోత్ సింగ్లాల్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, తహసీల్దార్ మహబూబ్అలీ, మార్కెట్ డైరెక్టర్లు శాంతిరతన్రావు, ఏకాంతం గౌడ్, నాయకులు సర్వర్, వెంకటేశ్వర్రావు, చిన్నపాక శ్రీనివాస్, యుగేంధర్రావు, జితేందర్రెడ్డి, సర్పంచ్లు అమడగాని రాజు, వెంకన్న, మాలతి, ఎంపీటీసీలు మాడ్గుల రాజు, బొట్ల మహేంద్ర, పరమేశ్వర్రావు, గూడ నరేందర్వర్మ, చింతల శ్రీనివాస్, బొట్ల మధు, జంగిలి యాకయ్య, నర్సింగం, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.