పర్వతగిరి, మే 6: బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు చేసిన మోసాలపై ఇంటింటికి వెళ్లి చర్చ పెట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని అన్నారం షరీఫ్, కల్లెడ, దౌలత్నగర్, చింతనెక్కొండ, ఏనుగల్లు, మల్యా తండా, చౌటపెల్లి, సోమా రం, వడ్లకొండ, గోపనపెల్లి, కొంకపాక, పర్వతగిరి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి సమావేశాల్లో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారితో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలను అడుగడుగునా నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలపై ప్రజల కు నమ్మకం పోయిందని, తెలంగాణ ప్రయోజనాలు, హక్కులు కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని అన్నారు. కేంద్రంలో చక్రం తిప్పాలన్నా, కాంగ్రెస్ మెడలు వంచాలన్నా కారు గుర్తుకు ఓటు వేసి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీలైన రుణమాఫీ, రూ. 500 బోనస్ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకుని వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతుల మీద ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఎన్నికల సంఘం అనుమతితో రైతు భరోసా, పంట నష్టం, రూ. 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్ ఇవ్వాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. పాలన కంటే కు తంత్రాలకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమం లో ఎంపీపీ కమలాపంతులు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్కుమార్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు జితేందర్రెడ్డి, ఎం భిక్షపతి, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యుగేంధర్రావు, శ్రీనివాస్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.