పెద్దవంగర/పాలకుర్తి రూరల్/కొడకండ్ల, సెప్టెంబర్ 1: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని, అరకోటికి పైగా ఆసరా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంటలో కొత్త పింఛను మంజూరు పత్రాలు, డిజిటల్ కార్డులను లబ్ధిదారులకు అందించారు. కొందరి ఇండ్లకు స్వయంగా వెళ్లి ఆప్యాయం గా పలుకరించి పింఛను మంజూరు పత్రాలను అందజేశారు. పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. కేంద్రం కొర్రీలు పెడుతూ మీటర్లు పెట్టాలని చూస్తున్నదని, ఇది రైతులు గమనించాలని సూచించారు. సొంత జాగలో ఇల్లు కట్టుకునే వారికి త్వరలోనే రూ.3లక్షలు అందించే యోచనలో ఉన్నామని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యం
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతున్నదని మంత్రి విమర్శించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బమ్మెర, పాలకుర్తి, మల్లంపల్లి, తిరుమలగిరి, గుడికుంట తండా గ్రామాల లబ్ధిదారులకు కొత్త పింఛన్ పత్రాలను కలెక్టర్ శివలింగయ్యతో కలిసి అందించారు. ఎంపీపీ నల్లా నాగిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాల విషపు మాటలను నమ్మవద్దని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మితే జీవితాలు నాశనమవుతాయని ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్ను విమర్శిస్తే ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
లబ్ధిదారులతో భోజనం
క్యాంపు కార్యాలయ ఆవరణలో పింఛను లబ్ధిదారులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి, కలెక్టర్ శివలింగయ్య సహపంక్తి భోజనం చేశారు. వృద్ధుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఆప్యాయతను చూసి వృద్ధులు సంబురపడ్డారు. ఇక్కడ అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీపీవో రంగాచారి, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, జడ్పీ సీఈవో ఎల్ విజయలక్ష్మి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, ఎంపీడీవో వనపర్తి ఆశోక్కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పసునూరి నవీన్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల అశోక్రెడ్డి, సర్పంచ్లు జలగం నాగభూషణం, గిరగాని హేమలత, బక్క పుల్లయ్య, పీఆర్ డీఈ చారి, ఏఈలు ధర్మేందర్, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, వైస్ ఎంపీపీ దార శారదాశంకరయ్య, పాము శ్రీనివాస్, కడుదుల కరుణాకర్రెడ్డి, మేడారపు సుధాకర్, సంతోష్కుమార్ పాల్గొన్నారు.
డీసీసీబీ సేవలు అభినందనీయం
రైతుల ఆర్థికాభివృద్ధి, విద్యార్థుల విదేశీ చదువులు, మహిళా సంఘాల సాధికారత కోసం డీసీసీబీ చేస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి కొనియాడారు. కొడకండ్ల రైతు వేదికలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నాబార్డ్ సదస్సులో దయాకర్రావు మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే విద్యార్థులకు విదేశాల్లో విద్యావకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయని తెలిపారు. పక్క రాష్ర్టాల వారు కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. విదేశాల్లో చదువుల కోసం మంజూరైన రుణాల చెక్కులను విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతీ రవీంద్రగాంధీనాయక్, సర్పంచ్ పసునూరి మధుసూదన్, ఏఎంసీ చైర్మన్ పేరం రాము, టీఎస్ ఈజీసీ సభ్యుడు అందె యాకయ్య, స్థానిక సర్పంచ్ కుందూరు విజయలక్ష్మి, కో ఆప్షన్ మెంబర్ నజీర్, జిల్లా రైతుబంధు సభ్యుడు సిందె రామోజీ, మండల అధ్యక్షుడు దీకొండ వెంకటేశ్వర్రావు, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, డైరెక్టర్ కుందూరు అమరేందర్రెడ్డి, కేలోతు భిక్షపతి, చెంచు రాజిరెడ్డి, దేశగాని సతీష్ తదితరులు పాల్గొన్నారు.
అవ్వా..బాగున్నవా..?
గంట్లకుంటలో ఓ ఇంటికి వెళ్లి పింఛను పత్రాన్ని అందించే క్రమంలో లబ్ధిదారుడు గతంలో దయాకర్రావుతో కలిసి దిగిన ఫొటోను మంత్రికి చూపించి సంబురపడ్డాడు. అతడిని ‘ఓ నువ్వేనా సోమయ్యా..’ అంటూ మంత్రి ఆప్యాయంగా పలుకరించారు. అలాగే ఓ ఇంటి వద్ద కూర్చొని ఉన్న ముసలవ్వ దగ్గరికివెళ్లి ‘అవ్వా..బాగున్నవా..? పింఛను వస్తున్నదా? అని ఆరా తీయగా ‘ఆమె వస్తున్నదయ్యా’ అని బదులిచ్చింది. మంత్రి స్వయంగా తమ ఇండ్లకు వచ్చి పింఛను పత్రాలు అందించడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. కార్యక్రమంలో సర్పంచ్ చింతల భాస్కర్రావు, ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జడ్పీటీసీ శ్రీరాం జ్యోతిర్మయి, పాలకుర్తి దేవస్థానం చైర్మన్ రామచంద్రయ్యశర్మ, ఎంపీడీవో వేణుగోపాల్రెడ్డి, రైతుబంధు గ్రామ కన్వీనర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, మాజీ అధ్యక్షుడు యాదగిరిరావు, సుధీర్కుమార్, కుమారస్వామి, పూర్ణచందర్, వెంకన్న, మల్లేశ్, సతీష్, వెంకటయ్య, సత్యనారాయణ, హరీశ్ యాదవ్, కుమార్యాదవ్ పాల్గొన్నారు.