ఖిలావరంగల్, నవంబర్ 25: ఊసరవెల్లిలా రంగులు మార్చే నాయకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారి అబద్ధపు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కోరారు. శనివారం ఆయన ఖిలావరంగల్ 37వ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే, డివిజన్లోని శంభునిపేట గిరిప్రసాద్నగర్, ఎంఎంనగర్, బుడగ జంగాల కాలనీలో ముమ్మర ప్రచారం చేయగా, మహిళలు వారికి బోనాలు, బతుకమ్మలు, పీరీలతో ఘన స్వాగతం పలికారు. యువత గజమాలతో సత్కరించి మద్దతు తెలిపింది. ముఖ్య అతిథులుగా శాసన మండలి డిప్యుటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, మాజీ ఎమ్మెల్యే దోనపూడి రమేశ్బాబు, సరోగసి బోర్డు సభ్యురాలు డాక్టర్ హరి రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులది కాళ్లు మొక్కించుకునే సంస్కృతి అని విమర్శించారు.
వారిని గెలిపిస్తే యువత భవిష్యత్ను నాశనం చేసే ప్రమాదం ఉందనని తెలిపారు. సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు. రూ. 4100 కోట్లతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. 37వ డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని చెప్పారు. డివిజన్లో 450 మందికి గృహలక్ష్మీ పథకం మంజూరు చేయించామన్నారు. దూపకుంటలో 2200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించామని, ఎన్నికల తర్వాత వాటిని అర్హులకు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి నిరుపేదలకు 60 గజాలుగా ప్లాట్లు చేసి పంపిణీ చేస్తామన్నారు. తూర్పు కోటను అభివృద్ధి చేసిన తనను మరోసారి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బిల్లా కవిత, శ్రమశక్తి అవార్డు గ్రహీత బిల్లా శ్రీకాంత్, ఆకుల ఉషశ్రీ, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు విజయ్, డివిజన్ ఇన్చార్జి బిల్లా రవి, అచ్చ విద్యాసాగర్, అర్షం రాంబాబు, శ్రీనివాస్, బోలుగొడ్డు శ్రీనివాస్, సంగరబోయిన ఉమేశ్, వాసుదేవ్, కరుణాకర్, శ్రీధర్రెడ్డి, మురళి, ఉల్ఫత్, అభిషేక్, మేకల ఎల్లయ్య, నలిగంటి నవీన్, ఫిరోజ్, ఏలియా, సురేశ్, హరి, ఠాగూర్, అరుణ పాల్గొన్నారు.
నరేందర్కు ఖిలావరంగల్లోని విశ్వకర్మ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మూడు కోటలకు సంబంధించిన 800 మంది ఓటర్లు కాసుల ప్రతాప్ ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. మెట్టు దర్వాజ నుంచి మధ్యకోట వరకు ర్యాలీ నిర్వహించి అన్నదానం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బైరబోయిన ఉమ, చిట్టిమల్ల రాంభద్రయ్య, మట్టెవాడ సూర్యప్రకాశ్, పెద్దపెల్లి సుధాకర్, మట్టెవాడ శ్యామ్, దయాకర్, దామోదర్, రమేశ్, శ్రీనివాస్, వరుణ్, వెంకటేశ్, యుగంధర్, రవి, రాజేశ్, సాయికుమార్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
కరీమాబాద్: తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్కే ప్రజలు మళ్లీ పట్టం కట్టాలని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు అభ్యర్థి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కోరారు. శుక్రవారం రాత్రి 42వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అన్ని వర్గాల వారికి బీఆర్ఎస్ సర్కారు అండగా నిలుస్తున్నదన్నారు. అభివృద్ధి కొనసాగాలన్నా.. అర్హులకు సంక్షేమ పథకాలు అందాలన్నా మరోమారు కేసీఆర్ సీఎం కావాలన్నారు. ఎన్నికలప్పుడే కనిపించే ప్రతిపక్షాలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని నన్నపునేని కోరారు. ప్రచారంలో భాగంగా మహిళలు ఎమ్మెల్యేకు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుండు చందన, డివిజన్ అధ్యక్షుడు కర్ర కుమార్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గిర్మాజీపేట: తనపై నమ్మకంతో పార్టీలో చేరిన వారందరికీ అండగా ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి, ఎన్నికల ఇన్చార్జి వగిలిశెట్టి అనిల్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురికి నరేందర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: ఎరుకల కులస్తులకు బీఆర్ఎస్ సర్కారు అండగా నిలుస్తున్నదని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ తిలక్రోడ్డులోని కేవీఎస్ ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్ ఓని స్వర్ణలతా భాస్కర్ అధ్యక్షతన ఎరుకల సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. వారి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఎరుకల కులస్తులందరూ తనకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల తర్వాత ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో రెండు కంపెనీలు ఏర్పాటు చేయించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాలకొండ భాస్కర్, రాజశేఖర్, పల్లకొండ హరి, ఓని రజిత, పి.కల్పన, రాయపురం సమ్మయ్య, పాలకుర్తి సాంబయ్య, దేవర ప్రసాద్, పద్మ, గంగాధర్, ఓని నారాయణ పాల్గొన్నారు.